మత్స్యకారులకు, చేనేత కార్మికులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు వచ్చే 3 నెలల కాలంలో 50 నుండి 100 కోట్ల రుణాలు ఇవ్వాలి బ్యాంకు ఉన్నతాధికారులను కోరిన ఎంపి బాలశౌరి
ఈరోజు జరిగిన దిశా కమిటి సమావేశంలో దిశా కమిటి చైర్మన్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ నరేగా పధకం కింద డొంక రోడ్లను కూడా చేర్చాలని, పండించిన పంటను పొలంనుండి రైతన్నలు మార్కెట్ కు తీసుకు వెళ్ళడానికి డొంక రోడ్ల అవసరం చాలా ఉన్నదని, ఈ విషయంలో ఒక నోట్ తయారుచేసి పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ని కోరారు.
అలెంకో వారినుండి దివ్యాంగులకు అవసరమైన యంత్రపరికరాలను తెప్పించాలని డిజేబుల్ ఏడి కి సూచించారు. రూరల్ వాటర్ సప్లయ్ శాఖను జల జీవన్ మిషన్ కింద అన్ని గ్రామాలకు త్రాగు నీరు అందించే విధంగా ప్రతిపాదనలు తయారుచేయాలని కోరారు. అలాగే ప్రస్తుత వేసవి కాలంలో కొన్ని గ్రామాలలో త్రాగు నీటి కొరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి గ్రామాలను గుర్తించి ట్యాంకర్ ల ద్వారా మంచినీటిని సరఫరా చేయవలసినదిగాను, అందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వ సంస్థలనుండి తెప్పిస్తానని హామీ ఇచ్చారు.
మన జిల్లాలోని కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర సముద్ర తీర ప్రాంతాలలో పంట పొలాలు సముద్రపు ఉప్పునీటి లవణియత వలన పంటలు పండటం లేదని, ఇక్కడి రైతుల ఆవేదనను అర్ధం చేసుకొని, నాబార్డ్ ద్వారా క్లైమేట్ చేంజ్ ఫండ్ పధకం కింద ఈ ప్రాంతలకు శాస్త్రవేత్తలను పంపి పరిశోధనలు చేసి పరిష్కారం కనుగొనాలని కోరారు.
వ్యవసాయ శాఖ వారిని కౌలు రైతులకు సి.సి.ఆర్.సి. కార్డులు అందజేయాలని, ఈ విషయంలో రెవిన్యూ శాఖ వారి సహకారం తీసుకోవాలని, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వారికీ పంట రుణాలు అందించాలని సూచించారు.
ఇరిగేషన్ శాఖ వారిని సమీక్ష చేసి వచ్చే వేసవి కాలంలోపే కాలవ యందలి గుర్రపు డెక్కను తొలగించానికి అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి, ఖరిఫ్ సీజన్ కు ముందే గుర్రపు డెక్కను తొలగించి రైతులకు సాగు నీరు అందించాలని కోరారు.
వైద్య శాఖవారిని సమిక్షించుచూ పెడన నియోజక వర్గంలోని చిన గొల్లపాలెం,చిన పండ్రాక గ్రామాలలోని ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని కోరారు. మొత్తం సుమారు 5 కోట్ల రూపాయలతో మరల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలను మెరుగు పరచడం జరుగుతుందని తెలిపారు. గుడివాడ ఏరియా ఆసుపత్రినందు సౌర ఫలకల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు.
రోడ్లు భవనాల శాఖను సమీక్ష చేస్తూ, జిల్లలో సేన్త్రస్ల్ రోడ్ ఫండ్ కింద జరుగుతున్న పనులను గురించి ఆరా తీసారు. ఎదురుమొండి బ్రిడ్జి నిమిత్తం అవసరమైన అదనపు 50 కోట్లకు ప్రతిపాదనలను నాబార్డ్ ద్వారా మంజూరు నిమిత్తం నివేదికలు తయారుచేయ వలసినదిగా కోరారు. అలాగే అవనిగడ్డ- కోడూరు రోడ్డు, గుడివాడ – కంకిపాడు రోడ్ల పరిస్థిని అడిగి తెలుసుకున్నారు.
నేషనల్ హై వే అధికారులతో మాట్లాడుతూ , విజయవాడ బందర్ నేషనల్ హై వే 65 ను 4 వరసల నుండి 6 వరసల రహదారిగా మార్చు పనులు త్వరగా పూర్తీ చేయాలనీ, అలాగే గన్నవరం ప్రాంతంలోని రైతులు పొలాలలో పండిన పంటను తెచ్చుకోవడానికి వీలుగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలనీ సూచించారు. అవసరమైన చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలనీ కోరారు.
విద్యుత్ శాఖ వారిని ప్రజలకు ప్రధాన మంత్రి సూర్య ఘర్ పధకం కింద ఎక్కువ మందికి సౌర ఫలకాలు అందచేయాలని తద్వారా వారికీ కరెంటు బిల్లులు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పౌర సరఫరాల శాఖ వారిని ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలనీ, రైతులనుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ములు జమ చేయాలనీ కోరారు. కూటమి ప్రభుత్వం మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్ల పధకం జిల్లాలో అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ని నిరుద్యోగ యువతకు రుణాలు అందిచే తట్లుగా ప్రయత్నం చేయాలనీ, పారిశ్రామిక వేత్తలను తయారుచేయాలని,బ్యాంకు వారితో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచించారు.
పంచాయతి రాజ్ శాఖ వారిని PM GSY – ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం కింద జరుగుతున్న పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.
చేనేత శాఖ వారిని పెడన నందు క్లస్టర్ ఏర్పాటు చేయాలనీ, ఈ విషయమై చేనేత కమిషనర్ తో మాట్లాడటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిపాదనలు పంపితే, కేంద్ర స్థాయిలో వెంటనే అనుమతులు మంజూరు చేయిస్తానని తెలిపారు. చేనేత కార్మికుల మాదిరిగానే గీత కార్మికులను కూడా వృత్తి ఆధారంగా రుణాలు మంజూరు చేయాలనీ సూచించారు.
మునిసిపల్ శాఖ వారిని సమీక్ష చేయుచూ అమృత్ 2.0 పధకం అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తీ చేయవలసినదిగా ఆదేశించారు.
ముఖ్యంగా సమావేశానికి విచ్చేసిన బ్యాంకు ఉన్నతాధికారులను అభినందిస్తూ, మొట్టమొదటి సరిగా జనరల్ మేనేజర్ స్థాయి బ్యాంకు అధికారులు ఈ సమావేశం నకు రావడం ఆనందంగా ఉందని, మీరంతా కలిసి రైతులకు, మత్స్యకారులకు, కౌలు రైతులకు, చేనేత కార్మికులకు , గీత కార్మికులకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు రుణాలు అందించి వారికీ బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరారు. వచ్చే మూడు నెలలలో అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కనీసం 50 నుండి 100 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని ప్రత్యేకంగా కోరారు.
ఈ సమావేశంలో జిల్లామంత్రివర్యులు కోల్లు రవీంద్ర కలెక్టర్ శ్రీ బాలాజీ శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ కాగిత కృష్ణ ప్రసాద్ వర్ల కుమార రాజా స్టేట్ బ్యాంకు జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ సుజయ్ మల్లిక్ , పంజాబ్ నేషనల్ బ్యాంకు జనరల్ మేనేజర్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ నాబార్డ్ జనరల్ మేనేజర్ ప్రసాద్ యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా డిజియం సీతా రామారావు ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు డిజియం అమిత్ కుమార్ శుక్లా యూకో బ్యాంకు డిజియం శ్రీకాంత్ సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఎజియం సతీష్ LDM రామిరెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు.