విజయవాడ
25-03-2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి
స్థానిక 41వ డివిజన్ భవానీపురంలో గల గాలీబ్ షహీద్ దర్గా నందు వైసిపి నాయకులు షేక్ రెహమాన్ ఆద్వర్యంలో మంగళవారం నాడు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు, వైసిపి నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుని వడ్డించారు
ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్, ఎండీ ఇర్ఫాన్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజ, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, జిల్లా మైనారిటీ వైసిపి అధ్యక్షులు షేక్ మస్తాన్, ముస్తాక్ అహ్మద్, వైసిపి నాయకులు అబ్దుల్ సత్తార్, మహ్మద్ అల్తాఫ్, ఎండీ ఇషాక్, బద్రుద్దీన్, అబ్దుల్ కాయుమ్, అత్తా మొహిద్దీన్, నసీమ్, ఇలియాస్, బడేమియా, మహ్మద్ గౌస్, యూనస్, గోరు సలీం తదితరులు పాల్గొన్నారు