*29-03-2025*
ప్రజల ఆరోగ్యమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
12 మంది లబ్ధిదారులకు రూ.16 లక్షల చెక్కులు అందజేత
10 మందికి సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు,ఇద్దరికి ఎల్.వో.సి పత్రాలు
విజయవాడ : రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటేనే రాష్ట్రం ఆర్యోగాంధ్రప్రదేశ్ గా మారి త్వరగా అభివృద్ధి దిశలో పయనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ విశ్వాసమని, అందుకే అనారోగ్యానికి గురై వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు ఆదుకునేందుకు పేద ప్రజల వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేస్తున్నారని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ తూర్పు,పశ్చిమ, సెంట్రల్, తిరువూరు నియోజకవర్గాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.15 లక్షల 79 వేల 851 విలువైన 10 చెక్కులను, రెండు ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అందజేశారు. లబ్దిదారులకు చెక్కులు, ఎల్.వో.సి పత్రాలతో పాటు ముఖ్యమంత్రి సందేశ పత్రాలను కూడా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అందజేశారు.
డూడ్ల సంద్య కి రూ. 6 లక్షల రూపాయాలు, జి.నాగేశ్వరరావుకి రూ.76, 300లు, బాణవతు లలిత కుమారి కి రూ.63,147 లు, షేక్ ఇమామ్ సాహేబ్ కి రూ.30 వేలు, షేక్ షకీలా పర్వీన్ కి రూ.30 వేలు, ఆర్.హేమలత కి రూ.30 వేలు. షేక్ గౌసియా బేగం కి రూ.18వేల 460 లు, పఠాన్ ఖాజేమియా కి రూ.35వేలు, వి.వెంకట కృష్ణ మూర్తికి రూ.1లక్ష6 వేల 524లు, పాటిబండ్ల బేబి సరోజని కి రూ.90వేల420 ల చెక్కులు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరయ్యాయి.
షేక్ షరీఫ్ అస్లామ్ కి రూ.2,50,000లు, మోదుగు వెంకటేశ్వరరావు కి రూ.2,50,000ల ఎల్.వో.సి పత్రాలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైద్యం విషయంలో పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిత్యం ఎంతో మంది పేదలకు వైద్యానికి అయిన ఖర్చుల్లో అత్యధిక భాగానికి అందజేస్తున్నారని తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎంపి కేశినేని శివనాథ్ కి ధన్యవాదాలు తెలిపారు.