పశ్చిమ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలి
ఐదేళ్లలో వెస్ట్ ను బెస్ట్ చేయడమే లక్ష్యం..
ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు, వ్యాపారస్తులు, స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు.
పశ్చిమ నియోజకవర్గం లోని వ్యాపార,వాణిజ్య వర్గాలు, ఉద్యోగస్తులు, వివిధ వర్గాల ప్రజలతో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు . నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గడిచిన 10 నెలల కాలంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య , వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తున్నామని తెలిపారు.
గతి తప్పిన పశ్చిమ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టేందుకు మరింత మెరుగైన అభివృద్ధిని సాధించాలని ప్రజా భాగస్వామ్యంతోనే అది సాధ్యమన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులను సాకారం చేసుకోవాలంటే ప్రజల నుంచి 30 శాతం కంట్రీ బ్యూషన్ ఉంటే 70 శాతం తన సొంత నిధులు, సీ ఎస్ ఆర్ నిధులను తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాత బస్తీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.. కార్యక్రమం లో భాగంగా రాబోయే కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ చేపట్టబోయే కార్యక్రమాలను ఫౌండేషన్ అడ్వైజర్ వేజెండ్ల శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు..
పలువురు వ్యాపారులు , వివిధ వర్గాల ప్రతినిధులు సమస్యలు చెప్పడంతో పాటు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు..
సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్, ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, గోల్డ్ మెడల్ ప్రవీణ్ కుమార్ జైన్, విజిఎస్ రామారావు, చిట్టూరి నాగేంద్ర , తమ్మన శ్రీను,చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వక్కల గడ్డ భాస్కరరావు, హిందూ హైస్కూల్ కమిటీ ఏవో నారాయణరావు,తూను గుంట్ల శ్రీనివాస్ కోగంటి రామారావు పోతిన స్వామి, కామా దేవరాజ్, బాయన వెంకట్రావు, పీయూష్ దేశాయ్, హను క్రొత్తపల్లి, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.