*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*
*ది.29.03.2025.*
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ సిబ్బందికి మరియు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐ.పి.యస్
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ నందు పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ పురస్కరించుకుని ది.29.03.2025వ తేదిన ఏ-కన్వెక్షన్ సెంటర్ నందు ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐ.పి.యస్ గరంలో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడమైనది.
*ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ…*
*కష్టపడి సంపాదించిన దానిలో పేదలకు పంచడం అనేది ఇస్లాంలోఉన్నటువంటి గొప్ప సంస్కృతి అని అలాగే ఇస్లాంలో ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణమైన ఇస్తారని. ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అలాగే ఇతర శాఖలో కూడా వారి సేవలు అమోగనీయం. ముస్లిం సోదరులు శాంతిభద్రతలు అదేవిధంగా సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడు ముందుంటూ అదేవిధంగా వారి సహాయ సహకారాలు కూడా అందించారు.*
రంజాన్ పండుగకు ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతవున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ‘రోజా'(ఉపవాస దీక్షలు), దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. కాబట్టి చాలా పవిత్రమైన రోజులు అని ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా, నిష్టగా, ఓపికతో ఉండి ఉపవాస దీక్షలు చేస్తారని, *ముస్లింలందరికి ఇఫ్తార్ విందును అందించుట ద్వారా ఇది మత సామరస్యానికి ప్రతీకగా సమాజానికి చాటి చెప్పడం జరుగుతుందన్నారు.*
*ప్రపంచంలో భారత దేశమునకు ఒక విశిష్టత ఉన్నదని అన్ని మతాలవారు కలిసి పరమత సహనంగా ఉంటారని, ముస్లిం సోదరులందరూ విద్య ఆర్థికంగా ఇంకా పురోగతి సాధించవలసిన అవసరం ఉంది. ముస్లిం సోదరులు అందరూ సమాజాభివృద్ధి,శాంతి లో కీలకపాత్ర పోషిస్తూ రంజాన్ సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని ముస్లిం మత పెద్దలు మరియు పోలీసు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.*
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ ఉదయరాణి ఐ.పి.ఎస్ ,శ్రీకృష్ణ మూర్తి నాయుడు , ఎ.డి.సి.పి జి.రామకృష్ణ , ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్ సిబ్బంది, మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.