Home public news ద్విభాషా ప్రసంగం తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రసంగం

ద్విభాషా ప్రసంగం తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రసంగం

3
0

 ద్విభాషా ప్రసంగం తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రసంగం

అమరావతి పునర్నిర్మాణ సభలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇంగ్లీష్, తెలుగు ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. 

సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రాజధాని అభివృద్ధి పనులు ఐదు సంవత్సరాల క్రితం అద్దాంతరంగా స్తంభించిపోయిన పరిస్థితిలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని అన్నారు. 

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టామన్నారు. మొన్నటికి మొన్న జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని, నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి 58 వేల కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే సమీప భవిష్యత్తులో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయికతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామన్నారు. మరోవైపు రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు రాష్ట్ర రైల్వే రంగానికి 74 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం, రాజధాని అమరావతికి ప్రధాన నగరాలకు అనుసంధానం చేసే విధంగా నూతన రైల్వే లైన్ల నిర్మాణం కోసం 2240 కోట్ల రూపాయలను కేటాయించడం, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయటం ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సంకల్పంతో జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్లు, ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ 11,500 కోట్లు, లక్ష 80 వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, కృష్ణపట్నం 4500 కోట్లతో పారిశ్రామిక సిటిగా అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని రెండు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భీమవరం బైపాస్ నిర్మాణం కోసం 2400 కోట్ల రూపాయలు నిధులు మంజూరు, జాతీయ రహదారుల అభివృద్ధికి సిఆర్ఎఫ్ పథకంలో భాగంగా వేల కోట్లు రూపాయలు మంజూరు చేయటంతోపాటు లోసరీ నుండి పిప్పర వరకు రహదారి నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైనటువంటి ఐఐటి, ఎయిమ్స్, ఐఐఎం, ఎన్ఐటి, పెట్రోలియం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీతో పాటు కొత్త మెడికల్ కాలేజీ లను రాష్ట్రానికి మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రసంగం ప్రధానమంత్రి ఆసక్తి గా ఆలకించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here