ఎమ్మెల్యే సుజనా చౌదరి ను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి ను శనివారం పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడిన ఆయన కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. హైదరాబాదులోని సుజనా చౌదరి నివాసం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి ,యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుజనా చౌదరి త్వరగా కోలుకొని , తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.