
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ.06.11.2025.
నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ షిరీన్ బేగం ఐ.పి.ఎస్.
నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో గుంటూరు, తాడేపల్లి వక్ఫ్ కార్యాలయం నందు సర్వే కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న షిరీన్ బేగం ఐ.పి.ఎస్. ని ఎన్.టి.ఆర్.జిల్లా ట్రాఫిక్ డిప్యూటీ పోలీసు కమిషనర్ గా బదిలీ చేసినారు.
ఈ సందర్భంగా ఈ రోజు షిరీన్ బేగం ఐ.పి.ఎస్. వ్యాస్ కాంప్లెక్స్ లోని ట్రాఫిక్ కార్యాలయం నందు ట్రాఫిక్ డిప్యూటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసినారు.
![]()
