విజయవాడ నగరపాలక సంస్థ
19-05-2025
అగ్ని ప్రమాదం నివారణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి – రాయన భాగ్యలక్ష్మి, మేయర్
అగ్ని ప్రమాదం జరిగితే సమయస్ఫూర్తితో వ్యవహరించాలి- ధ్యానచంద్ర, కమిషనర్
అగ్ని ప్రమాదం నివారణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వంటి విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం నివారణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజలను ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు ప్రమాదంలోకి దూసుకు వెళ్లే ఫైర్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని. పనిచేసే కార్యాలయంలో కానీ ఇంట్లో కాని అగ్గి ప్రమాదం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాలను మార్క్ డ్రిల్ ద్వారా విఎంసి సిబ్బందికి తెలియ చేయడం ద్వారా అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగిన వారికి వారి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలని అవగాహన వచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగితే సమయస్ఫూర్తితో వ్యవహరించాలని, ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థ రికార్డు కీపర్, సిబ్బంది ముఖ్యంగా తెలుసుకోవాలని ప్రమాదం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవగాహన వాళ్ళకు ఉండాలని వారి చేత మోక్ డ్రిల్లో మంటల ఎలా ఆర్పాలి వంటి విషయాలని వారి చేత చేయించారు. సిబ్బంది కూడా వారి కుటుంబ సభ్యులతో ఈ విషయాలని పంచుకుంటూ అగ్నిప్రమాదం జరగకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైయర్ సిబ్బంది కమిషనర్ ఛాంబర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ అలారం ద్వారా వచ్చే ధ్వని వినిన విఎంసి సిబ్బంది వెంటనే బయటికి వచ్చేయాలని, రూములో పొగలు కమ్మేస్తే పాకుకుంటూ బయటికి రావాలని, భవనంలో కింద వైపు మంటలు వ్యాపిస్తే డాబా పైకి వెళ్లాలని, డాబా పైకి ఎక్కిన బాధితులను ఫైర్ సిబ్బంది నిచ్చెన, తాడు ద్వారా వారిని మోసుకుంటూ ఎలా తీసుకు వస్తారు, ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను ఎలా ఆర్పుతారో అంబులెన్స్ ద్వారా వారికి దగ్గరలోని హాస్పిటల్ కి ఎలా చేరుస్తారు వంటి విషయాలను సిబ్బందికి చూపించారు.
కేవలం పనిచేసే కార్యాలయాలోనే ఉన్నాయి కాకుండా ఇంటి వద్ద అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గ్యాస్ సిలిండర్ లీక్ అయితే తడి టవల్ లేదా దుప్పటితో చుట్టేస్తే మంటలు ఆరిపోతాయని, కళాయిలో మంటలు వచ్చేస్తే వంట గదిలో ఉన్న పిండిను దానిపై చిన్న చిన్నగా వేస్తే మాటలు ఆగిపోతాయని, బాండీలో మంటలు వస్తే ఆక్సిజన్ రానీయకుండా మూతను క్రమంగా కొంచెం కొంచెంగా ఎలా మూస్తే మంటలు ఆగుతాయని అవగాహన కల్పించారు.
ఈ మోక్ డ్రిల్ లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అవతు శైలజ రెడ్డి, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, వీరమాచినేని లలిత, చెనగిరి రామ్మోహన్, తిరుపతమ్మ, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్ర శేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ సృజన, సూపరిండెంటింగ్ ఇంజనీర్ ప్రాజెక్ట్స్ పీ సత్య కుమారి, విఎంసి రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఎన్. వెంకటేశ్వర్రావు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ డి.మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యం. రాజా మరియు ఎన్టీఆర్ జిల్లా డిస్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ శంకర్ రావు sfo లు నరేష్, గౌతమ్, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.