
అమరావతి
29.10.2025
అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు
అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం (GOM) భేటి
పాల్గొన్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహరర్, సత్యకుమార్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై చర్చించాం
జిల్లాల విభజన వల్ల ఉన్న ఇబ్బందులను తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు.
ఆ హామీని నేరవేర్చేవిధంగా GOM ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు.
వాటితోపాటు GOMలో ఉన్న మంత్రులు ఇచ్చిన సూచనలను కూడా కూలంకుషంగా చర్చించాం
మండలాలు, పంచాతీయలు విభజన చేయకుండా నియోజకవర్గమంతా ఒకే డివిజన్ లో ఉండాలని నిర్ణయించాం.
మరోసారి సమావేశమై నివేదికను రూపొందించి సీఎంకు అందజేస్తాం
…..
నాదెండ్ల మనోహర్, రాష్ర్ట పౌరసరఫరాల శాఖామాత్యులు
కేంద్ర ప్రభుత్వం చేయబోయే జన గణనకు ముందే నివేదిక ఇస్తాం
సమయాన్ని కూడా పరిగణనలోని తీసుకొని అధ్యయనం చేసి నివేదిక ఇస్తాం.
![]()
