
మంత్రి కొలుసు పార్ధసారధి…
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వైసిపి రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించారు.
శనివారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. కల్తీ మద్యం పేరిట వైసిపి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. టిడిపి ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కు పాదం మోపుతుందన్నారు. కల్తీ మద్యం కేసుల్లో టిడిపి పార్టీ వ్యక్తులు ఉన్నా వారిపై తగిన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న వారిని సస్పెండ్ చేశామన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సురక్ష యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తామని కలలు కంటూ, అధికారుల మనోధైర్యం దెబ్బ తీసేలా వైసీపీ ప్రవర్తిస్తుందని, చట్టపరంగా పని చేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందని చెప్పారు…
![]()
