6-12-2024
ధి:6-12-2024 శుక్రవారం ఉదయం 10:30 “గం లకు” సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “UGD”లైన్ “A” & “B” బ్లాక్ కనెక్టింగ్ రోడ్స్ సుమారు ₹50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి
శంకుస్థాపన చేయడం జరిగినది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా :-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని శంకుస్థాపన పూజలో పాల్గొని 10రోజుల్లో అన్నీపనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తాం అని…
సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ శాసన సభ్యులుగా తాను, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్నిక అయిన తరువాత నియోజకవర్గంలో పనులు వేగవంతంగా పుంజుకొని అభివృద్ధి జరుగుతుందని…
ఈ ఆరు నెలల సమయంలోనే సుమారు ₹100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మొదలు పెట్టామని, గత వైసిపి ప్రభుత్వంలో చేసిన అవినీతి వల్ల రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం నిధులు లేక ఇబ్బందులు పడతా ఉన్నా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి నోటు లేకుండా ప్రజలకు చూస్తున్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద “RUB”ని నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని, తిరిగి ఇప్పుడు 2024లో పెరిగిపోయినటువంటి జనాభా వెహికల్స్ తో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, ఈ సమస్య మీద మొన్ననే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ని కలసి వినతి పత్రాన్ని అందజేశానని ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతానని తెలిపారని, విజయవాడ MP కేశినేని శివనాథ్ (చిన్ని) నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి రైల్వే శాఖ మంత్రితో భేటీ అయి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొని వస్తామని…
గత వైసిపీ ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ లో రహదారుల దుస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వాటి రూపురేఖల్ని పూర్తి స్దాయిలో మార్చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోంది అని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తామని బొండా ఉమా తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో:- కార్పొరేటర్ కంచి దుర్గ,కంచి ధన శేఖర్ ,బుగతా శ్రీరాములు, M మల్లేశ్వరరావు, సూరి,K రామరాజు,మైనంపాటి సుబ్బలక్ష్మి, రైల్వే ప్రసాద్, Sk బాషా, నాగుల్ మీరా , ఎర్నింటి సతీష్ తదితరులు పాల్గొన్నారు…