ఈ రోజు 30-6-24 ఉదయం 7.30 గంటలకు 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) డివిజన్ పర్యటనలో భాగంగా యాదవ కళ్యాణమండపం వద్ద
స్థానికులకు ఎన్డీఏ కూటమి కి ఓటు వేసి చంద్రబాబు ని సిఎం ని చేసినందుకు ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు,యువనేత లోకేష్ బాబు మార్గంలో శుభోదయం ప్రజాదర్బార్* నిర్వహిస్తున్నామని సమస్యలను అడిగి తెలుసుకొనగా స్థానికులు వీధిలైట్లు గురించి, మంచినీటిలో నలకల సమస్య గురించి, CC కెమెరాల ఏర్పాటు గురించి,under ground డ్రెయినేజీ సమస్య ,గత ప్రభుత్వంలో పెన్షన్ తొలగించిన వారు, రానివారు కొత్త పెన్షన్ లు ఇప్పించమని కోరగా కార్పొరేటర్ చంటి గారు వారికి అర్హులేని వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తామని,అదేవిధంగా డివిజన్ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.అలాగే అందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని,వ్యర్థ పదార్థాలు టబ్ లో వేసి కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వవలేననీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని యోగాలో భాగంగా అందరితోటి చప్పట్లు కొట్టించి ఉత్సాహ పరచడం జరిగింది.