5 నెలల కూటమిపాలనపై విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన పోతిన వెంకట మహేష్.
పాలించడం చేతకాక పాలన ,ఎలా చేయాలో తెలియక బాగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పై బురదజల్లే పనిని 5 నెలలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
అలజడులు అరాచకం అవినీతి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎటు చూసినా ఐదు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే
కేంద్రంలో కీలకంగా ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే నీళ్లు మట్టితో సరిపెట్టుకొని అప్పులు తీసుకుంటూ ఆనందంగా తలాడిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు.
1. కూటమి విధానాల వలన రాజకీయ శత్రుత్వాలకు బడి పిల్లలు బలవుతున్నారు. తల్లికి వందనం పథకం తలకిందులైంది.
2. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ లబ్ధి ఎంతవరకు అందడం లేదు
3. సకల శాఖలకు మంత్రిగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తారు
4. గెలవక ముందే చంద్రబాబు హామీలు గెలిచాక ఇక ఉండవు
5. రెడ్ బుక్ అమలు మీద పెట్టిన శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టకపోవడం విచారకరం
6. రైతులు ఉన్నారన్న విషయాన్ని ఐదు నెలలుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు రైతులకు తుఫాను పంట నష్టం అందలేదు రైతు భరోసా ఊసే లేదు క్రాప్ లోన్స్ సవరించే విషయంలో బ్యాంకుల వారితో చర్చే జరగలేదు
7. ట్విట్టర్లో తప్ప పెట్టుబడులు రాష్ట్రంలోకి రావడం లేదు
8. ఎన్నికలకు ముందు యువత వ్యాపారానికి 10 లక్షల వరకు లోన్ ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ మంత్రి పదవులు రావంగానే ఆయన మాటలు మూగబోయాయి.
9. బీసీలు డిమాండ్ చేస్తున్న కొలగణనను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది.
10. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న ఒక్క మంత్రి మండల సమావేశం కూడా పెట్టలేదు మద్యం పాలసీకి మాత్రం మంత్రి మండల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చర్చలు పెడుతున్నారు.