ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
43వ డివిజన్ తెలుగుదేశం నాయకులు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానికులు ఏర్పాటుచేసిన ఉట్టెను కొట్టారు.
ఏకలవ్య నగర్ లో టిడిపి నాయకులు కొనికి కొండయ్య, మైలవరపు కృష్ణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులు ఏర్పాటుచేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకిని మోసి ఉట్టెను కొట్టారు.