42వ డివిజన్లో స్థానికపెన్షన్పొందేలబ్ధిదారులైనటువంటి వృద్ధులు చేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం
చేపించారు
ఈరోజు 42వ డివిజన్లో వర్క్ షాప్ రోడ్ లోని అన్న క్యాంటీన్ దగ్గర 42 తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక పెన్షన్ పొందే లబ్ధిదారులైనటువంటి వృద్ధులు చేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేపించారు,
అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ను వృద్ధులు పెన్షన్ పెంపుదల యువత కొరకు డీఎస్సీ ప్రకటన రైతుల కొరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు యువత యువకులు మరియు మహిళలు కొరకు స్కిన్ డెవలప్మెంట్ పథకాలను అమలు చేసే జి వో రిలీజ్ చేశారు.
అదేవిధంగా త్వరలోనే ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తామని తెలియజేశారు
మాజీ కార్పొరేటర్ రామయ్య మాట్లాడుతూ గతంలో నారా చంద్రబాబు నాయుడు ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. మరల ఈ అన్న క్యాంటీన్ ను పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి ద్వారా త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలియ చేసారు..