కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
న్యూ ఢిల్లీ :
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న నివాసాల్లో దివ్యాంగుల హక్కులను గుర్తించి, సమానత, గౌరవం, యాక్సెస్ అంశాలను బలోపేతం చేయడానికి గల ప్రధాన చర్యగా భావిస్తున్నారు.