22(ఏ) నుండి ప్రైవేట్ భూములకు విముక్తి.. సర్కార్ ఆదేశాలు
మొత్తం సర్వే నంబర్ నిషేధ జాబితాలో వద్దు.
ప్రైవేటు భూములకు సర్వే, సబ్ డివిజన్ చేయాలి.
ఆన్లైన్ విన్నపాలపై కలెక్టర్ కమిటీ పరిశీలన.
హౌసింగ్ బోర్డు కాలనీలు, నివాస స్థలాలకూ స్వేచ్ఛ.
స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికుల భూములకు విముక్తి.
రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా మార్గదర్శకాలు.
విముక్తి కల్పించాల్సిన వాటిలో ముఖ్యమైనవి
రాష్ట్రంలో 1954, జూన్ 18కి ముందు అసైన్ చేసిన భూములను 22(ఏ) నుంచి తొలగించా లని 2018, నవంబరు 16న ప్రభుత్వం ఇచ్చిన జీవో 575ను కలెక్టర్లు అమలుచేయాలి. అంటే, ఆ కేటగిరీలోకి వచ్చే భూములను సాధారణంగానే నిషేధ జాబితా నుంచి తొలగించాలి. ఈ మేరకు జిల్లా రిజిస్ట్రార్లకు రిపోర్టు ఇవ్వాలి. రైతులకు హక్కులు దక్కిన చుక్కల భూములను నిషేద జాబితా నుంచి తొలగించాలి. 2022, మార్చి 23న ప్రభుత్వం ఇచ్చిన మెమో ఆధా రంగా రైతులకు హక్కులు ఉన్న చుక్కల భూము లను 22(ఏ) నుంచి తొలగించాలి.
రాష్ట్రంలో 1954, జూన్ 18కి ముందు ఆసైన్ చేసిన ఆనాధీన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలంటూ 2022, సెప్టెంబరు 26న ప్రభుత్వం ఇచ్చిన జీవో 649ను అమలు చేయాలి. ఈ కేటగిరీలోకి వచ్చే అనాదీనం మాములను నిషేధ జాబితా నుంచి జిల్లా కలెక్టర్ నేతృత్వం లోని కమిటీ తొలగించాలి.
1954కు ముందు ఇచ్చిన షరతుగల పట్టా భూములను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలి.