Home Political news 13వ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

13వ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

2
0

 వివక్షత లేకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం

అభివృద్ధిని అడ్డుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వైఎస్సార్

 13వ డివిజన్లో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

             తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి వివక్షత లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి ఎన్నికల్లో ఓట్లు తక్కువుగా వచ్చిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నేపట్టకుండా వివక్షత చూపారని చెప్పారు. ఎటువంటి వివక్షత లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు.

              మంగళవారం ఉదయం 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. డివిజన్లోని మెగా టౌన్ షిప్ వెనుక రోడ్డులో రూ.37 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శంకుస్థాపన చేశారు.

                  ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఈ కాలనీకి ప్రత్యేకత ఉందని కాలనీ వారంతా కలిసి కట్టుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటారని చెప్పారు. ఈ కాలనీలో 2 రోడ్లు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి రూ. 37 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఈ డివిజన్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ రాలేదని ఇక్కడ పనులను నిలిపి వేశారని చెప్పారు. గతంలో ఉన్న ఎంపీ ఇక్కడ సుమారు 10 కోట్ల రూపాయాలను కేటాయించారని, వాటికి అంచనాలు కూడా రూపొందించకుండా వైఎస్సార్సీపీ నాయకులు వ్యవహరించారని చెప్పారు. డ్రైనేజీ పనులు చేయకపోవడంతో వ్యర్థాలను తొక్కుకుంటూనే నడుస్తున్నారని అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఎక్కడా కూడా వివక్షత లేకుండా అభివృద్ది, సంక్షేమం చేయాలని చెప్పారన్నారు. డివిజన్లో సైను కాలువలు, భూగర్భ డ్రైనేజీ వల్ల సమస్యలు అధికంగా వస్తున్నా పనులు చేపట్టనీయలేదన్నారు. నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయనియకుండా అడ్డుకున్న చరిత్ర వైఎస్సార్ సీపీదని అన్నారు. ప్రజల సంక్షేమం, కాలనీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ పనులను అడ్డుకునే వారు కాదన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కాలనీలు అన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా వారా చంద్రబాబు నాయుడు అన్న సమయంలో కార్పోరేషన్ పై ఆర్థిక భారం పడకుండా కార్పోరేషన్ జీతాలను 010 పద్దు ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేవిధంగా చేశారన్నారు. దీని వల్ల సంవత్సరాలనికి సుమారు రూ.200 కోట్ల ఆర్థిక భారం కార్పోరేషన్పై తప్పిందన్నారు. ఆ నిధులతో కార్పోరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చునని చెప్పారు.

               కార్పోరేటర్ మమ్మునేని ప్రసాద్ మాట్లాడుతూ 13వ డివిజన్లో రెండు రోడ్లను నిర్మాణం చేయడానికి రూ.37 లక్షల వ్యయంతో పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.37 లక్షల వ్యయంతో రోడ్లను నిర్మాణం చేశామని చెప్పారు. గత వైఎస్సార్సిపీ ప్రభుత్వ హయాంలో కాలనీ అభివృద్ధి కుంటుపడిండన్నారు. కాలనీలోని అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లగా మార్పు చేస్తామని చెప్పారు. కాలనీ వాసులకు ఆకతాయిల సమస్య ఎక్కువుగా ఉందని స్థానిక మహిళలు చెప్పారని, ఈ సమస్యలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాలనీ వాసులు చెప్పిన ప్రతి సమస్యలను పరిష్కరిస్తామని ప్రసాద్ చెప్పారు.

           ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు గద్దె ప్రసాద్, వీరంకి డాంగీకుమారి, వేములపల్లి శ్రీనివాస్, కొరపాటి, శ్రీనివాస్, నూతి శ్రీనివాస్, లీలా ప్రసాద్, గోపాలరావు, శేషగిరిరావు, అడ్డుకట్ట రామారావు, జావిరాజు నాని, ఈడుపుగంటి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here