*ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 06, 2024*
100 శాతం బీమా క్లెయిమ్ల పరిష్కారంపై దృష్టిపెట్టండి
– ఇప్పటికే పూర్తయిన 98.20 శాతం క్లెయిమ్ల పరిష్కారం.
– బాధితులకు చేయూతనివ్వడంలో బీమా సంస్థల కృషి భేష్
– ఎన్టీఆర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా
వరద ప్రభావిత ప్రాంత ప్రజల వాహనాలు, వివిధ ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్ల పరిష్కారంలో బీమా సంస్థలు చూపిన చొరవ ప్రశంసనీయమని.. ఇప్పటికే 98.20 శాతం క్లెయిమ్ల పరిష్కారం పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి క్లెయిమ్లను కూడా త్వరితగతిన పరిష్కరించాలని బీమా సంస్థలకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా.. డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీమా సంస్థల వారీగా నమోదైన క్లెయిమ్లు, పరిష్కరించిన క్లెయిమ్లు, ఇంకా మిగిలియున్న క్లెయిమ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ 12,638 మోటార్ వాహనాల క్లెయిమ్లు, 2,821 ఆస్తుల క్లెయిమ్లతో కలిపి మొత్తం 15,459 క్లెయిమ్లు నమోదు కాగా 605 ఉపసంహరణ, 325 తిరస్కరణకు గురైన క్లెయిమ్లు పోనూ 14,529 నికర క్లెయిమ్ల్లో ఆన్ అకౌంట్, అండర్ ఆక్షన్తో సహా 98.20 శాతం క్లెయిమ్ల సెటిల్మెంట్ చేయడం జరిగిందన్నారు. బీమా క్లెయిమ్ల పరిష్కారంపై గౌరవ ముఖ్యమంత్రి తొలినుంచి ప్రత్యేకంగా దృష్టిసారించారని.. ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు లభ్యత తక్కువగా ఉండటం, అటాచ్మెంట్ రుణాలు, ఆర్సీ క్యాన్సిలేషన్ తదితరాల వల్ల కొన్ని క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయని.. వీటిని త్వరితగతిన పరిష్కరించి, సెటిల్మెంట్ ప్రక్రియను పూర్తిచేయాలని నిధి మీనా సూచించారు.
సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్.ప్రవీణ్, జీఎం-డీఐసీ బి.సాంబయ్య , వివిధ బీమా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.