హెరిటేజ్ మిల్క్ డెయిరీ పార్లర్ నూతన ఫ్రాంచైజీ ప్రారంభం
విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ లో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ మిల్క్ డెయిరీ పార్లర్ నూతన ఫ్రాంచైజీ ప్రారంభోత్సవంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఫ్రాంచైజీ ఓనర్ మొగిలి వెంకట ప్రసాద్ ఆహ్వానం మేరకు ప్రత్తిపాటి శ్రీధర్, బిజెపి కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, టిడిపి డివిజన్ అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు, హెరిటేజ్ డివిజనల్ మేనేజర్ అర్ ఎమ్ మస్తాన్, గొల్లపూడి బ్రాంచ్ మేనేజర్ వెంకట్రావు, విశ్వనాధుని బాలకాశి రావు తదితరులు హెరిటేజ్ నూతన ఫ్రాంచైజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూటర్ మొగిలి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన హెరిటేజ్ నూతన శాఖ లాభాల బాటలో పయనించాలని వారు ఆకాంక్షించారు.