హర్ గర్ తిరంగా బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
పశ్చిమ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో హర్ గర్ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి స్వాతి థియేటర్, దుర్గగుడి, బ్రాహ్మణ వీధి, చిట్టినగర్, సితార, ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. సుజనా మాట్లాడుతూ మన జాతీయ జెండాను సగర్వంగా ప్రదర్శిస్తూ ఐక్యత మరియు దేశభక్తిని చాటుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు