స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందు
, కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.
విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు తదితరులతో సుజనా ముచ్చటించారు. కార్యక్రమంలో నారా లోకేష్ హుషారుగా కనిపించారు.