15-08-2024
స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలి :ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే సుజనా,
శంకర్ కేఫ్ సెంటర్ లో పంద్రాగస్టు వేడుకలు
జాతీయ పతాకం ఎగరవేసిన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా,
విజయవాడ : బ్రిటిష్ పరిపాలనలో 200 ఏళ్లు బానిసలుగా బ్రతికిన భారతీయులకి స్వాతంత్య్రం అందించిన సమరయోధుల్ని ఆదర్శంగా తీసుకోని జీవించాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని బిజెపి నాయకులు వడ్లాని మాధవ్ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకి ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వాతంత్య్ర సమర యోధుల చిత్ర పటాలకు పూలు సమర్పించి నివాళి ఆర్పించారు. అలాగే ఆ సెంటర్ లోని వంగవీటి రంగా విగ్రహానికి కూడా నివాళులర్పించటం జరిగింది. అనంతరం జాతీయ జెండాను ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి కలిసి ఎగరవేయగా పి.సి.ఎమ్.సి గర్ల్స్ హైస్కూల్ విద్యార్ధులు జనగణమన ఆలపించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కనకదుర్గ ఆలయ మాజీ చైర్మన్ పైలా సోమి నాయుడు, టిడిపి రాష్ట్ర నాయకులు ఎమ్.ఎస్. బేగ్, మాదిగాని గురునాథం , కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.