Home Political news స్వచ్ఛాతా హి సేవ పై మనందరిలో అవగాహన పెరగాలి – సినీ హీరో సుధీర్...

స్వచ్ఛాతా హి సేవ పై మనందరిలో అవగాహన పెరగాలి – సినీ హీరో సుధీర్ బాబు

4
0

 విజయవాడ,

తేదీ: 20.10.2024

   స్వచ్ఛాతా హి సేవ పై మనందరిలో అవగాహన పెరగాలి

– సినీ హీరో సుధీర్ బాబు

          స్వచ్ఛతా హి సేవ అనేది కేవలం వాక్‌ థాన్‌తో ముగిసిపోకుండా మనందరి నిత్య జీవితంలో ఒక భాగంగా కొనసాగాలని సినీ హీరో సుధీర్‌ బాబు పిలుపునిచ్చారు. ఆదాయ పన్ను శాఖ స్వచ్ఛతా హి సేవ లో భాగంగా ఆదివారం నిర్వహించిన వాక్ థాన్ ర్యాలీని ఉద్ధేశించి ముఖ్య అతిధిగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు సినీ హీరో సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో విద్యార్ధులతో వాక్ థాన్ రన్ లో పాల్గొనటం సంతోషంగా ఉందని, వీళ్లందర్నీ చూస్తుంటే ఎంతో ఎనర్జిటిక్ గా కూడా ఉందని తెలిపారు. మంచి ఉద్దేశ్యం కోసం మనందరం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం ఒకడుగు ముందుకు వేసి మన ఇంటితోపాటు, పరిసరాలను, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛతా హి సేవ గురించి మన చుట్టుపక్కల వారికి, ఫ్యామిలీ మెంబర్స్ కి, ప్రెండ్స్ కి, తెలిసిన వారికి తెలియజెప్పాలన్నారు. నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ వీధులు అప్పటికి, ఇప్పిటికి చూస్తే ఇప్పుడు చాలా క్లీన్ గా ఉన్నాయన్నారు. విద్యార్ధులు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సంతోషమన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాల్సిన బాధ్యత ఉందన్నారు.

విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వీరేందర్ మెహెతా మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా రన్ ప్రచారంలో విద్యార్ధులు పాల్గొనటం చాలా సంతోషదాయకం అన్నారు. హైద్రాబాద్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ సురేష్ బత్తిని మాట్లాడుతూ ప్రధాని మోదీ చొరవను ముందుకు తీసుకెళ్లడం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. స్వచ్ఛతా హి సేవ పై ప్రజలందరూ ఎంతో అవగాహన కలిగి, ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు.

విజయవాడ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీమతి సునీత బిల్లా మాట్లాడుతూ విద్యార్ధులు భావి భారతదేశ పౌరులుగా వారు స్వచ్ఛమైన మరియు హరిత భారతదేశాన్ని రూపొందించడంలో చురుకైన పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు. వాక్ థాన్ రన్ లాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో అవగాహన పెంపొందే అవకాశం ఉందన్నారు. ముందుగా అందరి చేత స్వచ్చతా హి సేవ పై ప్రతిజ్ఞ చేయించారు.. అనంతరం సినీ హీర్ సుధీర్ బాబు వాక్ థాన్ రన్ ను బందర్ రోడ్డు లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుండి మొఘల్ రాజ్ పురం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం వరకు ఈ వాక్ థాన్ రన్ కొనసాగింది. కార్యక్రమంలో విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) డీజీ రాజేంద్ర చౌదరి, గుంటూరు ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ శ్రీమతి సుప్రియ, విజయవాడ ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ అభినయ. ఎన్, ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ దోనేపూడి విజయ్ బాబు మరియు ఆదాయపు పన్ను శాఖ అధికారులు శ్యామలాదేవి, ఈశ్వరరావు, రామ్ ప్రసాద్, రాఘవులు మరియు విద్యార్ధులు, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ విద్యార్ధులు, ఇతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here