విజయవాడ
26-03-2025
స్థానిక 48 డివిజన్ మోతి మసీద్ ప్రాంగణంలో గల షాదీఖానా లో బుధవారం నాడు వైసిపి నాయకులు షేక్ మహారాజ్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నజీర్ మౌలానా చే నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాని పంపిణీ చేసారు
ఈ కార్యక్రమంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైయస్ ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్, దుర్గ గుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు మహ్మద్ అన్వర్, రషీద్, యుసుబ్, సమీర్, ఖాజా, ఉస్మాన్, వలి, వైసిపి నాయకులు పిళ్ల సూరి బాబు (జగ్గు), అయితా కిశోర్, చిచ్చా తదితరులు పాల్గొన్నారు