*సోమిరెడ్డి ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఇరిగేషన్ ఎస్ఈ*
ఆదిత్య హృదయం ప్రతినిధి
*సోమశిల, కండలేరు డ్యాంలను పరిశీలించిన అనంతరం రాపూరు మండల పరిధిలోని గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి*
*సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సోమశిల, కండలేరు ప్రాజెక్టులతో పాటు సర్వేపల్లికి సంబంధించిన పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన సోమిరెడ్డి*
*కండలేరు ఎడమ కాలువ ఎత్తిపోతల ప్రాజెక్టు పెండింగ్ కరెంట్ బిల్లులు, సోమశిల దక్షిణ కాలువ అటవీ అనుమతులు, డేగపూడి – బండేపల్లి కాలువ పనులతో పాటు పలు అంశాలపై మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతుల సమర్పణ*
*రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జా నుంచి కాలువలు, కాలువ కట్టలు, కాలువ పొరంబోకులను కాపాడాలని కోరిన సోమిరెడ్డి*
*మొన్న డిసెంబర్ లో మొదటి పంట సాగుకు నీటి విడుదల జరుగుతున్న సమయంలోనే ఓ & ఎం పనులకు టెండర్లు పిలిచి ఫిబ్రవరిలో పనులు చేసినట్లు చూపి రూ.18 కోట్లు బిల్లులు చేయడంపై అధికారులను ప్రశ్నించిన సోమిరెడ్డి..నీళ్లు నమిలిన సెంట్రల్ డివిజన్ ఎస్ఈ కృష్ణమోహన్*
*అక్టోబర్ నాటికి పూర్తి చేయాల్సిన పనులకు నవంబర్ లో నీటి విడుదల తర్వాత డిసెంబరులో టెండర్ పిలవడం, కాలువ నిండా నీళ్లు పారుతున్న సమయంలో పూడిక తీశారని జనవరి నెలాఖరులో బిల్లులు పెట్టడం, ఆర్నెళ్లు మెయింటెనెన్స్ గడువు ఉండగానే ఫిబ్రవరిలో బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించడంపై సమాధానం చెప్పలేకపోయిన ఎస్ఈ*
*ఐదేళ్లలో పనులు చేయకుండానే రూ.150 కోట్లకు పైగా స్వాహా చేశారని తెలిపిన చంద్రమోహన్ రెడ్డి*
*సర్వేపల్లి నియోజకవర్గంలో పనులు చేయకుండానే చేసినట్టు చూపి బిల్లులు చేసుకున్న వ్యవహారంపై విచారణ చేపడుతామని ప్రకటించిన మంత్రి నిమ్మల రామానాయుడు*