ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ.24.07.2025.
సైబర్ క్రైమ్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. బి.రాజ శేఖర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీసు స్టేషన్ నందు డి.ఎస్.పి.గా పని చేస్తున్న బి.రాజ శేఖర్ ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు సైబర్ క్రైమ్ ఏ.సి.పి.గా బదిలీ అయినారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అంధించినారు.