03-06-2025 సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే బొండా తో కలిసి పలు ప్రాంతాల్లో రైల్వే సమస్యలు పరిశీలన ఎంపి కేశినేని కి పెండింగ్ లో వున్న ఆర్.యు.బి, ఆర్.వో.బి వివరాలు తెలిపిన ఎమ్మెల్యే బొండా**గుణదల డాన్ బాస్కో, దేవినగర్ -వాంబే కాలనీ రైల్వే కట్ట, దేవినగర్ -సింగ్ నగర్ మధ్య కట్ట , మధురానగర్ పప్పుల మిల్లు ప్రాంతాలు పర్యటన*రేపు డి.ఆర్.ఎమ్ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలు ప్రస్తావన*త్వరలో ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి ను కలవనున్న ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు*విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రైల్వేకి సంబంధించి పలు ఆర్.యు.బిలు, ఆర్.వో.బిలు పెండింగ్ వున్నాయి. ఈ నియోజకవర్గంలో నెలకొన్న రైల్వే సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాను.త్వరలో పదిహేను రోజుల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను, రైల్వే బోర్డ్ చైర్మన్ లను ఆర్.యు.బి., ఆర్.ఓ.బి లను మంజూరు చేయాల్సిందిగా కోరతామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు..ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి మంగళవారం నియోజకవర్గంలో నెలకొన్న రైల్వే సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు 1వ డివిజన్ గుణదల డాన్ బాస్కో ప్రాంతం, దేవినగర్ -వాంబే కాలనీ రైల్వే కట్ట, దేవినగర్ -సింగ్ నగర్ మధ్య కట్ట , మధురానగర్ పప్పుల మిల్లు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్.యు.బి, ఆర్.వో.బి లు లేక రైల్వే ట్రాక్స్ దాటేందుకు తాము పడుతున్న ఇబ్బందులు ఎంపి, ఎమ్మెల్యేలకు స్థానిక ప్రజలు చెప్పటంతో పాటు పరిష్కరించాల్సిందిగా వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వున్నఅన్ని రైల్వే గేట్స్ కి ఆర్.యు.బి., ఆర్.వో.బిలు తీసుకువచ్చి ఆ పనలు ప్రారంభించే విధంగా కృషి చేస్తామన్నారు. రేపు జరగబోయే డి.ఆర్.ఎమ్ మీటింగ్ లో సెంట్రల్ నియోజకవర్గంలో పెండింగ్ లో వున్న రైల్వే సమస్యలపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.ఎమ్మెల్యే బొండా ఉమా 2014 సమయంలో సత్యనారాయణ పురంలో ఆర్.యు.బిలు, కంప్లీట్ చేయటం జరిగిందన్నారు. ముఖ్యంగా సింగ్ నగర్ కి పెరిగిన ట్రాఫిక్ రీత్యా రెండో ఫ్లై ఓవర్ చాలా అవసరం.ఈ రెండో ఫ్లై ఓవర్ అంశం అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రైల్వే శాఖ తో ముడిపడి వుందన్నారు. కాబట్టి ఈ సమస్య ను కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సింగ్ నగర్ కి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎమ్మెల్యే బొండా తో కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ రైల్వే జంక్షన్ గా కావటం వల్ల మెయిన్ రైల్వే లైన్లు విజయవాడ టూ హౌరా, వైజాగ్ టూ సికింద్రాబాద్, గూడ్స్ లైన్ అన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మీదగానే వెళతాయన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబునాయుడుతో పాటు రైల్వే అధికారుల దృష్టికి ఇక్కడ 6 ఆర్.వో.బి లు, 3 ఆర్.యు.బిలు అవసరమని ప్రతిపాదించినట్లు తెలిపారు. గతంలో 2014 నుండి 2019 మధ్య మధురానగర్ డబల్ లైన్ ఆర్.యు.బి ను, బుడమేరు వంతెన వద్ద ఒక ఆర్.యు.బి ను తీసుకొని వచ్చామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అవసరమైనటువంటి ఈ ఆర్.యు.బి, ఆర్.వో.బి లను పట్టించుకోలేదన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఆగిపోయిన రైల్వే పెండింగ్ పనులు మొదలు పెట్టడంపై దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే 2009 లో మొదలు పెట్టి పెండింగ్ లో వున్న ఉలవచారు కంపెనీ దగ్గర ఆర్.వో.బి కి టెక్నికల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయని…నెల రోజుల్లో ఆ పనులు మొదలు కానున్నాయన్నారు. మధురానగర్ పప్పుల మిల్లు వద్ద ఒక ROB ని రైల్వే అధికారుల రాష్ట్ర అధికారులతో పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ గొట్టుముక్కల రఘురామ రాజు స్థానిక ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Home Andhra Pradesh సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)...