వర్గీకరణ ఉద్యమ అమరవీరులకు సుప్రీం తీర్పు అంకితం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
సుప్రీం తీర్పుపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి స్పందన
.
ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారు
సామాజిక న్యాయం పాటించే పేటెంట్ హక్కు టీడీపీదేనని మరోసారి స్పష్టమైంది
కులాల మధ్య చిచ్చు పెట్టి జగన్ చలికాచుకున్నారు
మాదిగలను కేవలం తన ఓటు బ్యాంకుగానే జగన్ చూశారు తప్ప ఏనాడూ వర్గీకరణపై మాట్లాడలేదు
వర్గీకరణ కోసం దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న మాదిగలకు సుప్రీం తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది
ఎస్సీలంతా అన్నదమ్ముల్లాగా కలసి వున్నాం…భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాం.
మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలి.
అణగారిన వర్గాలకు న్యాయం జరిగింది.
ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది.
మా ప్రభుత్వం ఎస్సిల అభ్యున్నతికి కట్టుబడి ఉంది.
30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది.
ఇన్ని ఏళ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారు వారి అమరత్వానికి తగిన ప్రతిఫలం దక్కింది…..