సుజనా చౌదరి కోలుకోవాలని ప్రార్థనలు
ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని పశ్చిమ ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ సీనియర్ నాయకులు దుర్భేశుల హుస్సేన్ ఆధ్వర్యంలో బుధవారం భవానిపురం కరకట్ట ప్రాంతం లోని జామియా మహాదుల్ అష్రఫ్ మదర్సా, మరియు మహమ్మదీయ మసీద్ లలో ప్రత్యేక దువా చేశారు. మౌలానా అష్రఫ్ అలీ, మహమ్మదీయ మసీద్ ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్, నిజాముద్దీన్, ఉమర్ షరీఫ్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని అల్లాని వేడుకున్నారు.
ఆయన ఆరోగ్యం బాగుండాలని వారు ఆకాంక్షించారు.