సీపీఐ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయండి
` వచ్చే నెల 3 నుంచి 7వ తేది వరకు నందిగామలో రెడ్షర్ట్ వలంటీర్ల శిక్షణా తరగతులు
`కమ్యూనిస్టు పార్టీ చరిత్రతో కూడిన ప్రత్యేక సంచికకి సహకరించండి
`సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్
విజయవాడ:
దశాబ్ధాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) 2024 డిసెంబరు 26వ తేదిన 100వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా వచ్చే 26 నుండి 2025 డిసెంబరు 26 వరకు జరిగే శతవార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో ‘రెడ్ షర్ట్ వలంటీర్ల శిక్షణా తరగతులు’ వచ్చే నెల 3 నుంచి 7వ తేది వరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక దాసరి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ శిక్షణా తరగతుల్లో చివరి రోజైన డిసెంబరు 7వ తేదిన నందిగామలో రెడ్ షర్ట్ వలంటీర్ల కవాతు ప్రదార్శన, సభ జరుగుతాయని చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ శిబిరంకు సీపీఐ శ్రేణులు విరివిగా పాల్గొనాలని కోరారు. రెడ్ షర్ట్ వలంటర్లు, జనసేవా దళ్ సభ్యులు సంఘ వ్యతిరేక శక్తులను ఎదుర్కొవటానికి, ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు ప్రజలకు సేవలు అందించటానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ శిక్షణా తరగతులు జరుగుతాయని చెప్పారు. 2025 డిసెంబరు 26వ తేదిన ఢల్లీిలో పెద్ద కవాతు జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు, భూమి కోసం, భుక్తి కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాలు, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణం, విశిష్టత చరిత్రను ప్రజలకు వివరించటం జరుగుతుందన్నారు. ప్రజలు తమ వంతుగా హార్థిక, ఆర్థిక సహయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
కమ్యూనిస్టు పార్టీ చరిత్రతో ప్రత్యేక సంచిక:
పీడిత ప్రజల విముక్తి పోరాటాల చరిత్ర, రక్తాక్షరాల త్యాగనిరతి కమ్యూనిస్టు పార్టీ సొంతం అన్నారు. సీపీఐ వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వర్తమాన ,భవిష్యత్ తరాలకు తెలియజజెప్పేందుకు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో సీపీఐకి భూపోరాటాల చరిత్ర ఉందన్నారు. విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు తదితర ప్రాంతాల్లో సీపీఐ మహాజ్వల ఘట్టాలను, చరిత్రకి సంబంధించి వ్యాసాలు, ఛాయాచిత్రాలతో కూడిన 200 పేజీలతో ప్రత్యేక సంచిక విడుదల చేయనున్నట్లు వెల్లడిరచారు. దీని కోసం కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, సీనియర్ నాయకులు తమ అనుభవాలతో వ్యాసాంశాలను లిఖించి ప్రత్యేక సంచికకు హార్థిక, ఆర్థిక సహయ సహకరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, లంకా గోవిందరాజులు, జిల్లా సమితి సభ్యులు కే.కార్తీక్ పాల్గొన్నారు.