*01-02-2025*
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ వసూళ్ల రాజా :టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా
విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం
దోనేపూడి శంకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నాగుల్ మీరా
పార్టీకి చందా ఇవ్వకపోతే నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయటం అలవాటు
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పై శంకర్ చేసిన ఆరోపణలు అర్ధరహితమంటూ ఖండన
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో తీసుకువచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇసుక అందుబాటులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షలను ఆచరణలో పెట్టి ఎన్టీఆర్ జిల్లాలో అనుమతి లేని ఇసుక రీచ్ లను నియంత్రణ చేసి పేద వాడికి ఉచితంగా ఇసుక అందించాలనే ఉద్దేశ్యంతో కృషి చేస్తున్న ఎంపి కేశినేని శివనాథ్ పై సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన నిరాధారమైన తప్పుడు ఆరోపణలను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తీవ్రంగా ఖండించారు.
ఇసుక అక్రమ రవాణా ఎంపి కేశినేని శివనాథ్ అండదండలతో జరుగుతుందని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ చేసిన నిరాధారమైన తప్పుడు ఆరోపణలు అర్థరహితమంటూ గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా నాగుల్ మీరా మాట్లాడుతూ సిపిఐ పేరు చెప్పుకుంటూ దోనేపూడి శంకర్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాడన్నారు. శంకర్ ఒక వసూళ్లు రాజా అంటూ…పార్టీ కార్యక్రమాల పేరుతో టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపి కేశినేని శివనాథ్ ను చందాలు అడిగే పరిస్థితి వుందన్నారు…ఇవ్వకపోతే ఇలాంటి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయటం శంకర్ కి అలవాటుగా మారిందన్నారు. సిద్దాంతాలకు తిలోదాలకు ఇచ్చిన శంకర్ లాంటి వ్యక్తులు సిపిఐలో వుండటం వల్ల ఆపార్టీకి వున్న విలువ కోల్పోతుందన్నారు.
బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ వసూళ్లు రాజాగా మారిన దోనేపూడి శంకర్ పై సిపిఐ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగితే సిపిఐ పై ప్రజల్లో మిగిలిన కాస్త గౌరవం కూడా మంట కలిసిపోతుందన్నారు. కేవలం తన స్వార్థం కోసం నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన దోనేపూడి శంకర్ పై ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) న్యాయపోరాటానికి సిద్దమైయ్యారని హెచ్చరించారు. వసూళ్ల రాజా దోనేపూడి శంకర్ కి ఎంపి కేశినేని శివనాథ్ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. ఒకప్పుడు రూ.7వేల వున్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.2 వేల 5 వందల నుంచి రూ.2వేల 7వందలకి దొరుకుతుంది. ఉచితంగా ఇసుక లభిస్తుంటే ఇసుకలో ఏ విధంగా దోపిడి జరుగుతుందో శంకర్ సమాధానం చెప్పాలంటూ నాగుల్ మీరాప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ఇసుక కొరత కృతిమంగా సృష్టించి వైసిపి నాయకులు పేద ప్రజలను సొమ్మును దోచుకోని దాచుకున్నారని మండిపడ్డారు. పేదవాళ్లకి ఇసుక లభించక, భవన నిర్మాణ కార్మికులకు పని దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదప్రజలు, కార్మికులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారన్నారు. నదిలోకి ట్రాక్టర్, ఎడ్లబండ్లతో ఇసుక తెచ్చుకోవచ్చనని సీఎం చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. ఉచిత ఇసుక విధానం అమలు కావటంతో ప్రజలు పండుగ చేసుకోవటమే మాత్రమే కాదు..సీఎం చంద్రబాబు నాయుడుకి నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. ఇసుక ఉచితంగా లభిస్తుండటంతో ప్రతి ఉరిలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు లైన్బలో వుంటున్నాయన్నారు. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక లభిస్తున్న నేపథ్యంలో దోనేపూడి శంకర్ ఎంపి కేశినేని శివనాథ్ పై చేసిన వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు. ఎంపి కేశినేని శివనాథ్ ఇసుక విషయంలో జోక్యం చేసుకున్నారనే పదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
ఉచిత ఇసుక ప్రజలకు అందాలని ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఉపేక్షించవద్దని ఎంపి కేశినేని శివనాథ్ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ అందించిన ప్రజల మనస్సుల్లో శాశ్వతంగా వుండేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న పనులకి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెచ్చుకున్నారని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే ఎంపి కేశినేని శివనాథ్ ను తన పార్లమెంట్ నియోజకవర్గంలో 70 శాతం మంది ప్రజలు అభినందస్తూ ఆదరిస్తున్నారనే విషయం టిడిపిపి సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పి ప్రశంసించారన్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జరగని పనులన్నీ జరిపించటం కోసం జిల్లా అధికారులకు నిరంతరం అందుబాటులో వుంటూ వారి తో రివ్యూ మీటింగ్ లు పెట్టి ఆ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
పేదల పక్షాన పోరాటం చేస్తాము..కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పుకోవటం కాదని ఎద్దేవా చేశారు. పేదల పక్షాన, కార్మికుల పక్షాన వుంటూ వారి సంక్షేమం, అభివృద్ది కోసం టిడిపి మాత్రమే కృషి చేస్తుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. సిద్దాంత పరంగా నాయకులు పనిచేయకపోవటంతో
సిపిఐ లోకి ఔట్ గోయింగ్ తప్పితే ఇన్ కమింగ్ లేదన్నారు. వాళ్లు ఏది అడిగితే అది చేయాలి.. ఇవ్వాళ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడతా వున్నారని…ఇదంతా ప్రజలు గమనిస్తున్నారనే విషయం
సిపిఐ నాయకులు గ్రహించాలన్నారు. విజయవాడ ను కొత్త నగరంగా తీర్చిదిద్దాలనే తపనతో .
వున్న ఎంపి కేశినేని శివనాథ్ పై ఇలాంటి నిరాధారమైన తప్పడు ఆరోపణలు చేయటం సబబు కాదన్నారు.
ఎంపి కేశినేని శివనాథ్ పై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి సమాధానం చెప్పటానికి
ఏడుగురు ఎమ్మెల్యేలు , టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దంగా వున్నారని ఈ విషయం గ్రహించి వాస్తవాలు మాత్రమే మాట్లాడాలన్నారు. ఇక పై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు వాగితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ ..చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ఏదైనా చేతనైతే ప్రజలకు మేలు కలిగే పనులు చేయాలని సూచించారు. సిపిఐ అధినాయకత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది వున్నా ఎంపి కేశినేని శివనాథ్ పై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేసిన వసూళ్ల రాజా దోనేపూడి శంకర్ పై చర్యలు తీసుకోకపోతే మసకబారిపోతారని నాగుల్ మీరా హెచ్చరించారు. ఈ మీడియాలో సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ నాగుర్ పాల్గొన్నారు.