అమరావతి…
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం
మొత్తం 23 అంశాలకు ఆమోదం తెలిపిన అధారిటీ
రాజధానిలో కీలకమైన భవనాలు,రోడ్లు,వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన అధారిటీ
నారాయణ,మంత్రి..
గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం మూడు ముక్కలాట తో అమరావతిని నిర్వీర్యం చేసింది
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నాం
11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచెందుకు అధారిటీ సమావేశంలో నిర్ణయం
360 కిమీల ట్రంక్ రోడ్లలో కు 2498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం
వరద నివారణ కు 1585 కోట్లతో పాల వాగు,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి ఆమోదం
గెజిటెడ్,నాన్ గెజిటెడ్,క్లాస్ -4,అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3523 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం
రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు,మౌళిక వసతుల కల్పనకు 3859 కోట్లకు అనుమతి
ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తాం
Undar ground డ్రైనేజీ,స్ట్రీట్ లైట్స్,తాగు నీరు,ల్యాండ్ స్పింగ్…ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం.
5 ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ,హై కోర్టు భవనాలు డిజైన్లకు టెండర్లు పిలిచాం..
డిసెంబర్ నెలాఖరుకు ఐకానిక్ భవనాలు కు టెండర్లు పిలుస్తాం.
గత ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది.
ఆడవారిని కూడా హింసించారు
రాజధాని అమరావతిలో ఉండకూడదని ప్రయత్నం చేశారు
5 కోట్ల మంది రాష్ర్ట ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రాబోయే మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం