సీఎం చంద్రబాబుకు ఉండవల్లి శ్రీదేవి కృతజ్ఞతలు
విజయవాడ:- నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో తనకు స్థానం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన పదవికి వన్నె తీసుకొచ్చేలా జాతి అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. మరోవైపున మాదిగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పొందిన ఉండవల్లి శ్రీదేవికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.*