Home Political news సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాలకు గుడ్ బై చెబుతున్న‌ట్లు...

సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాలకు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

3
0

 సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాలకు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక మీద తాను రాజ‌కీయాల గురించి మాట్లాన‌ని చెప్పారు. తాను ఏ పార్టీని పొగ‌డ‌ను అని, మ‌రే పార్టీని విమ‌ర్శించ‌ను ఏ పార్టీని స‌పోర్టు చేయ‌న‌ని అని తెలిపారు. త‌న‌ను ఎవ‌రూ ఏమీ అన‌లేద‌న్నారు. తాను ఎప్పుడు మంచి రాజకీయ నాయకులను విమర్శలు చేయలేదన్నారు. త‌న‌కు న‌రేంద్ర మోదీ 35 ఏళ్లుగా తెలుసున‌ని, ఆయ‌న్ను ఎప్పుడు విమ‌ర్శించ‌లేద‌న్నారు. ఇందిరా గాంధీ, న‌వీన్ ప‌ట్నాయ‌క్ వంటి వారిని విమ‌ర్శించ‌లేద‌న్నారు. తాను అన్ని పార్టీల‌కు స‌పోర్టు చేశాన‌ని, అలాగే విమ‌ర్శ‌లు చేశాన‌ని ఆయా పార్టీల్లోని నాయ‌కుల గుణ‌గ‌ణాల బ‌ట్టి మాత్ర‌మేన‌ని అన్నారు. తాను అంద‌రి కంటే ఎక్కువ‌గా పొగిడింది చంద్ర‌బాబు నాయుడినేని అన్నారు. చంద్రబాబు చేసిన మంచి ప‌నుల‌

ను ఓ లిస్ట్ కూడా రాసుకున్నాన‌ని చెప్పారు. ఆయ‌న పొర‌పాట్లు చేసిన‌ప్పుడు విమ‌ర్శ‌లు చేశాన‌న్నారు. ఇక నుంచి త‌న చివరి శ్వాస వరకు కుంటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here