Home Political news సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం! ఈ రోజు మిమ్మల్ని...

సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం! ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది

2
0

 సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం!

ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది

!

ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనివృద్ధి చేస్తాం

ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల అభినందన సభలో మంత్రి లోకేష్

*సీట్లు సాధించిన 25మంది విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల బహుకరణ*

అమరావతి: ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, మీరంతా ఛాంపియన్స్ … హ్యాట్సాఫ్. జాతీయస్థాయిలో పేరున్న ఐఐటి, ఎన్ఐటి ల్లో సీటు కొట్టడం అంత ఈజీ కాదు. దేవుడు పెట్టిన అన్ని పరీక్షల్లోనూ మీరు విజయం సాధించారు. ఇక మీకు తిరుగులేదని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ చొరవతో జిఓ 225 విడుదల కారణంగా జాతీయస్థాయి విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25మంది విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేశారు. విద్యార్థులను పేరుపేరునా అభినందించిన మంత్రి లోకేష్ వారందరికీ స్వంత ఖర్చుతో ల్యాప్ ట్యాప్ లను బహుకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి వచ్చిన వెంటనే  ఇంత స్పీడ్ గా పనిచేసిన అధికారులందరినీ పేరుపేరునా అభినందనలు. ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు కల్పించడం, తద్వారా పేదరికం లేని ఆంధ్రరాష్ట్రం మాలక్ష్యం. కెజి నుంచి పిజివరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలన్నది మా ధ్యేయం. 

*ఒక్కరికీ కూడా అన్యాయం జరగకూడదని చెప్పా*

సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం. దానికి ఒక మీరంతా ఉదాహరణ. మీలో ఉన్న పృథ్వి నాకు ఒక వాట్సప్ మెసేజ్ పెట్టాడు. ఎలిజిబిలిటీ ఉన్నా చిన్న టెక్నీకల్ సమస్య వలన ఐఐటి, ఎన్ఐటి ల్లో అడ్మిషన్ రిజెక్ట్ చేస్తున్నారు అని మెసేజ్ చేసాడు. సబ్జెక్ట్ నాకు కూడా కొత్త… ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. వెంటనే మా అధికారులను పిలిచి ఈ సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. మీరు ఏం చేస్తారో తెలియదు ఒక్క విద్యార్థి కి కూడా అన్యాయం జరగకూడదు అని చెప్పాను. మా వాళ్ళు జెఈఈ అధికారులతో సంప్రదింపులు చేసారు. ప్రత్యేక జిఓ తీసుకురావాలి అని చెప్పారు. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జిఓ ఇచ్చాం. 25 మందికి ఐఐటి, ఎన్ఐటిల్లో అడ్మిషన్ వచ్చింది. ఇటువంటి సమస్య మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని మా అధికారులకు చెప్పాను.

*నాకు చాలెంజ్ అంటే ఇష్టం*

నేను విద్యా శాఖ తీసుకుంటున్నా అంటే మిత్రులు భయపెట్టారు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి.. అలాంటి శాఖ తీసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పారు. వాళ్లు నా మంచి కోరే చెప్పారు. కానీ నాకు ఛాలెంజ్ అంటే ఇష్టం. 2019లో మంగళగిరిలో ఓడిపోయా, గెలవాలనే పట్టుదలతో పనిచేశా. కాంప్లిగేటెడ్ శాఖ ఎందుకని మిత్రులు సలహా ఇచ్చారు. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న నేను విద్యా శాఖ తీసుకోవడానికి భయపడితే ఇక ఎవరు తీసుకుంటారు? ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్నా. వచ్చే ఏడాదిలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కారం టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తున్నా. యువత ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో తెలుసుకున్నా. వారికి అండగా నిలిచేందుకే విద్యాశాఖ తీసుకున్నా. 

*మీరంతా నాకు ఇన్స్పిరేషన్*

ఇక్కడ ఉన్న మీ 25 మంది నాకు ఇస్పిరేషన్. నేను విద్యా శాఖ తీసుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు జిఓ ఇచ్చి 25 మందికి సీట్లు వచ్చాయి అని తెలిసిన రోజు హ్యాపీగా నిద్రపోయా. ఆ రోజు వరకూ ఈ సమస్య ఎలా పరిష్కారం చెయ్యాలి అని నా మైండ్ పనిచేస్తూ ఉంది. చదువు కు ఉన్న గొప్పతనం నాకు బాగా తెలుసు. ఇంట్లో ఒక్కరు బాగా చదువుకొని మంచి ఉద్యోగంలోకి వెళ్తే ఆ తరువాత తారలు అన్ని అదే ఫాలో అవుతారు. ఆల్ ది బెస్ట్ మిమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. మీకు ఏ సహాయం కావాలన్నా, మీకు గైడెన్స్ కావాలన్నా ఒక అన్న గా సహాయం చేస్తా. మీకు అందుబాటులో ఉంటా, ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క వాట్సప్ మెసేజ్ పెడితే చాలు,  వెంటనే స్పందిస్తా.

*ఏడాదిలో దేశం మొత్తం ఎపివైపు చూసేలా చేస్తాం*

ఒక్క ఏడాది లో దేశం మొత్తం ఎపి వైపు చూసేలా పనిచేస్తాం, పెట్టుబడులు తెస్తాం, ఉద్యోగాలిస్తాం, దేశంలో ఎపిని ముందువరుసలో నిలుపుతామని మంత్రి లోకేష్ అన్నారు. నేను అమెరికాలో చదువుకున్నా, ఐఐటి, ఎన్ఐటిలో చదవాలన్నది నా కలగా ఉండేది.  చదువు పూర్తయ్యాక భారత్ లో వ్యాపారం చేయగలరా అని నా మిత్రులు అన్నారు, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. వృద్ధిలోకి వచ్చాక మీరు మరో 10మంది జీవితాల్లో మార్పు తీసుకురండి. ఇంకా మరికొందరికి సమస్య ఉందని తెలిసింది. వారికి కూడా సాయం చేస్తాం. వెనుకాడేది లేదు.

*నా బిడ్డకు వచ్చిన కష్టం మాదిరిగానే భావిస్తా*

పృధ్వీ సత్యదేవ్ గత నెల 22న మెసేజ్ పెట్టిన వెంటనే కార్యదర్శి నుంచి అధికారులందరినీ అలర్ట్ చేశాను. నా బిడ్డకు అనారోగ్యంవస్తే ఎంత కంగారు పడతానో మీ బాధను కూడా అలాగే భావించాను. బటన్ నొక్కితే దివ్యాంగుల సర్టిఫికెట్లు నేరుగా వచ్చేలా ఆరునెలల్లో ప్రక్షాళన చేస్తాం. ఫీజు రీఎంబర్స్ మెంట్  వంటివి కూడా టైమ్ ప్రకారం వచ్చేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు బలోపేతం చేయాలి, గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 50వేలమంది తగ్గిపోయారు. మీ అందరి ఆశీస్సులతో అయిదేళ్లలో స్కూళ్లలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మీ తల్లిదండ్రులు గర్వపడేవిధంగా మంచిగా చదువుకోండి. నాకుదేవుడు అవకాశం ఇచ్చాడు, సాయం చేశాను. మీకు కూడా సాయం చేసే అవకాశం వచ్చినపుడు సాయపడండి. 

*పేదరికం లేని సమాజమే మా లక్ష్యం*

ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చుపేదరికం నుంచి ప్రజలను శాశ్వతంగా బయటకు తేవాలన్నదే మా ధ్యేయం. ఇది ప్రజల ప్రభుత్వం, మేమంతా ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారీ తనం ఉండాలి. స్టాన్ ఫోర్డ్ లో సీటు వచ్చినరోజు అమ్మ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు అలాగే మీ తల్లిదండ్రులు కూడా అంతే ఆనందంలో ఉన్నారు. మా శాఖలో అంతా గందరగోళంగా ఉంది, ఇప్పుడిప్పుడే అధ్యయనం చేస్తున్నా. సంక్షేమంతోపాటు విద్యతో పేదరికం నుంచి దూరంచేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. కెజి టు పిజి విద్యలో సమూల మార్పులు తెస్తాం.మీరంతా చదువు పూర్తయ్యాక మళ్లీ అమరావతివచ్చి సేవలందించాలి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం, ఆ దిశగా పనిచేస్తాం. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మీకు సాయం చేశా, అది మీరు మర్చిపోవద్దు. మీవద్దకు వచ్చి ఎవరైనా సాయం అడిగితే చేతనైనంత సాయం చేయండి. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, నిధి మీనాలకు లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here