Home Andhra Pradesh సాయంత్రం గుడివాడ రూరల్ మండలాల్లో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని

సాయంత్రం గుడివాడ రూరల్ మండలాల్లో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని

4
0

 42వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం.

ఉదయం నందివాడ.సాయంత్రం గుడివాడ రూరల్ మండలాల్లో ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని

సైకిల్ తుప్పు పట్టినా.బెల్ ఒక్కటే మిగిలింది ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగిస్తున్నాడు ఆ బెల్ పేరు అబద్ధాల మేనిఫెస్టో

మరో ఆరు రోజులపాటు జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రజలందరూ సీఎం జగన్ కు మద్దతుగా ఉండాలి

ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు చూశాం.గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

మే 13న ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి

నందివాడ,గుడివాడ రూరల్ 08:ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 42వరోజుకు చేరుకుంది. నందివాడ మరియు గుడివాడ రూరల్ మండలాల్లో బుధవారం ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన చేపట్టారు. ఉదయం మండల కేంద్రమైన నందివాడ గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాయంత్రం గుడివాడ రూరల్ మండలంలోని చినవానిగూడెం…. తట్టివర్రు….సీపూడి….కాశిపూడి గ్రామాల్లో ప్రచారం చేపట్టనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూల వర్షం కురిపిస్తూ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్… బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో వందలాది మంది తరలివచ్చి ఎమ్మెల్యే కొడాలి నానిను తమ గ్రామాల్లో పూల వర్షంతో నడిపించారు. గ్రామాల వారీగా పర్యటనలు చేస్తూ సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ.. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ..తుప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. సైకిల్ తుప్పు పట్టినా.. బెల్ ఒక్కటే మిగిలిందని… ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగించాడు.. ఆ బెల్ పేరు అబద్ధాల మేనిఫెస్టో.. అధికారంలోకి వచ్చే వరకు అబద్ధాలు, మాయలు, మోసాలే చేస్తారంటూ ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే నాని.ఇక, చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలన్నారు.. మరో 6 రోజుల పాటు జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రజలందరూ సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలన్నారు.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే… పథకాలన్నీ ముగింపు అని ఆయన హెచ్చరించారు.. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో సీఎం జగన్ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చారు.. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రజలు ఆలోచన చేయాలన్నారు.. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న జగన్ ప్రభుత్వం మాదిరి…. గతంలో ఎవర్రు చెయ్యలేదని ఎమ్మెల్యే నాని అన్నారు.

ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు పై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను….. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను భారీ మెజార్టీలతో గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ పెయ్యల ఆదాం, జడ్పిటిసి కందుల దుర్గాకుమారి, ఏపీ టూరిజం డైరెక్టర్ నగుళ్ళ సత్యనారాయణ, కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కొండపల్లి రంగారెడ్డి, గుడివాడ నియోజకవర్గం బూత్ కమిటీ ప్రెసిడెంట్ బట్టిపాటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు వెన్న ప్రభావతి, గుజ్జుల చైతన్య జ్యోతి, పిట్ట విశ్రాంతమ్మ, గుత్తా సత్యనారాయణ (చిన్ని), సచివాలయ కన్వీనర్ చైర్మన్ దేశిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, సర్పంచులు సరెళ్ల రత్నకుమారి, సింగాల రాధాకృష్ణ, తప్పిట ధనలక్ష్మి,, జాజుల జోస్నా దేవి, కర్నాటి సత్యనారాయణ,తెనాలి అనరుణకుమారి, వసంతల సత్యవతి, గూడపాటి రజిని, 

*నందివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* వైస్ సర్పంచ్ రాజులపాటి చంద్రశేఖర్, కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కొండపల్లి కృష్ణారెడ్డి, పెయ్యల జగదీష్, మెండు చందు, బండి కోటి బాబు, చిన్నం క్రాంతి, లింగం సుందర్రావు, గోవాడ అశోక్, సన్నీ, రత్న కుమార్, బట్టిపాటి శ్రీనివాస్ రెడ్డి, పెయ్యల జగన్, పెయ్యల అనిల్, తులిమెల్లి శాంతి కుమార్, నత్త మరియమ్మ, వాసే మిల్కీ, ఆకునూరి చార్లెస్, నత్త రవి, నేరుసు శ్రీను, దుంపల శ్రీను, బొడ్డు రాజేష్, పెయ్యల అశోక్, పెయ్యల సోను, పెయ్యల రాణి, కర్రే చిన్నారి, చంటి, పెయ్యల సుశీల, పెయ్యల సాగర్, కడిమి కిషోర్, చిన్న,

*నందివాడ మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట నాగరాజు, కందుల నాగరాజు, చింతాడ నాగూరు, పరిమి అమృత బాబు, పామర్తి మురళీకృష్ణ, బేతపూడి నవరత్నరాజు, రాజులపాటి చంద్రశేఖర్, కొండపల్లి చంద్రశేఖర రెడ్డి, కటికల సూర్యచంద్ర, రాజేష్, పూడి సుధాకర్ రావు, సకలాబత్తిన దిలీప్ కుమార్, మేడేపల్లి ప్రసాద్, 

*నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* పర్వతనేని ఆనంద్, గిరి బాబాయ్, పిల్లి బెనర్జీ, సూరపనేని కళ్యాణ్, తోట రాజేష్, ఘంటా సురేష్, పుల్లెట్టుకుర్తి వినయ్, చుండి బాబి, చుండూరి శేఖర్, నీరుడు ప్రసాద్, అబ్దుల్ రజాక్, గుడివాడ టౌన్, రూరల్, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here