వ్యవసాయ శాఖ పత్రికా ప్రకటన
మంగళగిరి 14/11/24
. సాగులో వున్న ప్రతి పైరును ఈ పంట లో నమోదు చేయాలి
.
ఈ పంట నమోదులో రబీ సీజన్ లోసవరించిన మార్గదర్శకాలను అనుసరించాలి.
15 మార్చ 2025 కల్లా ఈ పంట సాగు రైతుల లిస్ట్ లను రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శన కు పెట్టాలి.
ది.14/11/2024 గురువారం స్థానిక మంగళగిరి రాష్ట్రవ్యవసాయ సంచాలకులు వారి కార్యాలయము నుండి రాష్ట్రములోని 26 జిల్లాల లోని అన్ని తరగతుల క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులతో ఈ పంట డిజిటల్ విధానము ద్వారా పంటల నమోదు – రబీ సీజన్ నుండి సవరించిన మార్గదర్శకాలు అనే అంశంపై విడియో కాన్ఫరెన్స ను రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయము నుండి వి వి విజయలక్ష్మి, అదనపు సంచాలకులు & ఆత్మ పథక సంచాలకులు:
. బాల సుబ్రహ్మణ్యం, సూపరిన్డెంట్ ఇంజనీర్, డిజిటల్ సెల్.
. జగ్గారావు, వ్యవసాయ ఉపసహాయకులు.
బాల భాస్కర్, సహాయ సంచాలకులు, ఈ పంట
. డి. వేణుగోపాల్, డిడి పంటల బీమా పాల్గొన్నారు.
సమావేశములో డిల్లి రావు మాట్లాడుతూ నెల / భూమిపై సాగులో వున్న అన్ని రకముల పంటల విస్తీర్ణం ను ఈ పంటలో నమోదు చేయాలని తెలిపారు.
ఒక సీజన్ కాలం నుండి సాగులో లేని బంజరు భూములను (CURRENT FALLOWS) ప్రత్యేకముగా నమోదు చేయాలని,
వ్యవసాయ భూములు నుండి వ్యవసాయేతర భూములుగా మారిన వివరములను కూడా నమోదు చేయలని తెలిపారు. పంటల సాగు వివరములను పూర్తి వాస్తవికతతో నమోదు చెయ్యాలని, ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వ పోర్టల్ లో అనుసందానించడం జరుగు తుందని, అందుచేత క్షేత్ర సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం అని తెలిపారు అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో ఈ పంట నమోదు లో రైతును, పంట వివరములతో తీస్తున్న ఫోటో ఇమేజెస్ స్పష్టముగా వుండేటట్లు చూడాలని తెలిపారు.
జియో ఫెన్సింగ్ విధానం ద్వారా గరిష్ట నడిచి 50 మీటర్ల లోపు పంట వివరములను నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ పంట రబీ సన్నద్ధత మరియు కాల పరిమితిని తెలుపుతూ సోమవారం (18/11/24) నుండి మొదలుకొని సోషల్ ఆడిట్, లిస్టులను నోటీసు బోర్డులలో ప్రదర్శన అన్నిటిలో 15 మార్చ 2025 లోపు పూర్తి చేయాలని కోరారు. విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సూపర్ చెక్ చెయ్యాలని తెలిపారు.
కార్యక్రమములో రబీ ఈ పంట సన్నద్ధత పై వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు వారి అనుభవాలను, సూచనలను తెలిపారు.