అమరావతి :
సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లలో సహజ వనరులు దోపిడీ చేశారు గత ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసింది – భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారు – కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారు – విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు – ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ నేతలు దందా చేశారు – 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు – వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు – ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారు – రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం – వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్ను కూడా కొట్టేశారు – దస్పల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారు – మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూఅక్రమాలకు పాల్పడ్డారు – ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్లల ఆస్తి కాజేసేందుకు యత్నం – ఒంగోలు భూకబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం – తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు – తిరుపతి జిల్లాలో భూఅక్రమాలకు లెక్కే లేదు – 22-ఏ పెట్టి భూఅక్రమాలు చేశారు – చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారు – హైదరాబాద్లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టా – హైదరాబాద్లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టా – పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారు – పేదవారి అసైన్డ్ భూములను వైసీపీ నేతలు లాక్కున్నారు – హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారు – ముందే స్థలం కొనేవారు.. అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారు.. – గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారు – నివాసయోగ్యం కాని ఆవ భూములను కేటాయించారు – అక్రమంగా భవనాలు కట్టేశారు.. ప్రశ్నించే వారిపై దాడులు చేశారు – 13,800 ఎకరాలను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారు – తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు – అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు – భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు – భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారు – ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చు – ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు – ల్యాండ్ టైటిలింగ్ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారు – ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరుతున్నా – భవిష్యత్తులో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం – భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి – గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తాం – తాము భూమి యాజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలి – మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారు – బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారు – గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకువస్తాం – పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారు – గనుల కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు – ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చారు – అధికారులను డిప్యుటేషన్పై తెచ్చుకుని అక్రమాలకు పాల్పడ్డారు – ఇసుక తవ్వకాల్లో అక్రమంగా భారీ యంత్రాలు వాడారు – ఇసుక తవ్వకాల కోసం నదులు, కాలువలపై రోడ్లు వేశారు – ఇసుక దందాను ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారు – కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు – వైసీపీ నేతలకు కప్పం కట్టలేక అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు – ఇసుక దందాలో రూ.9,750 కోట్ల కొట్టేశారు – అటవీ, గనులశాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరు – వైసీపీ హయాంలో అటవీ, గనులశాఖ, ఒకే వ్యక్తికి అప్పగించారు – తూ.గో.జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు – ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు – చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్స్పెక్షన్ల పేరుతో వేధించారు – కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వేశారు – దౌర్జన్యం, బెదిరింపులు, జరిమానాల పేరతో గనుల దోపిడీ – పల్నాడు జిల్లాలో ఇష్టానుసారం అటవీసంపద కాజేశారు – చారిత్రక ప్రాంతాల్లోనూ అడవులు కొట్టేశారు – రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు – రుషికొండ కట్టడాలు.. ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడమే – భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పూర్తిగా మింగేశారు – ఆఖరికి ద్రవిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారు – నెల్లూరు జిల్లాలో క్వార్జ్ ఖనిజాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారు – పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయి – ప్రకృతి సంపద ప్రజలకు చెందాలి – గనుల బాధితులు ముందుకు రావాలి.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి – అమరావతి రోడ్డుపై ఉన్న మట్టిని తవ్వుకుని పోయారు – ఎర్రచందనం దొంగరవాణా కోసం అక్రమాలకు పాల్పడ్డారు – ఎర్రచందనాన్ని దొంగరవాణా చేసి చైనాకు పంపారు – ఎర్రచందనం టాస్క్ఫోర్స్ సిబ్బందిని తగ్గించారు – వైసీపీ నేతలు.. ఎర్రచందనం స్మగ్లర్లను ప్రోత్సహించారు – స్మగ్లర్లను ప్రోత్సహించడం సమాజానికి చాలా ప్రమాదం – ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలి – భూగర్భ ఖనిజ సంపద సమాజహితానికి వినియోగించాలి – వైసీపీ బాధిత గనులు, క్రషర్ల యజమానులు ముందుకు రావాలి – అడవులు మింగేసిన అనకొండలను శిక్షిస్తాం – తిరుపతి జిల్లాలోని కొండలపై ఔషధ మొక్కలు పెంచాం – విశాఖ కొండలపై వివిధరకాల పూలమొక్కలు ఉండాలనేది నా కల – గనుల దోపిడీ కోసం అధికారులను బెదిరించారు.. బదిలీలు చేశారు – వైసీపీ నేతల దోపిడీకి కొందరు అధికారులు సహకరించారు – భూకబ్జాలు, గనులు, అటవీసంపదను దోచిన వారిని శిక్షిస్తాం – ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం – నేరస్థులు, దోపిడీదారులను వదిలిపెట్టం.. కఠినంగా శిక్షిస్తాం – టీడీఆర్ బాండ్లు, రేషన్ బియ్యంలోనూ అక్రమాలకు పాల్పడ్డారు – దొంగకు తాళాలిచ్చి దోచుకునేలా ప్రోత్సహించారు – అవినీతిపరులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు – భోగాపురం విమానాశ్రయ భూములు లాక్కున్న వారిపై చర్యలు – భూకబ్జాలపై టోల్ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు తీసుకుంటాం – భూముల రీసర్వే పేరుతో నష్టపోయిన వారికి న్యాయం చేస్తాం – దోపిడీ చేసిన మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా వసూలు చేస్తాం : సీఎం చంద్రబాబు