సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ను కలిసిన ఏపీఎంపీఏ రాష్ట్ర నాయకులు
ఆదిత్య హృదయం ప్రతినిధి
విజయవాడ
సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లాను ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఏ.పీ.ఎం.పీ.ఏ. రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి మత్తి శ్రీకాంత్, కృష్ణాజిల్లా అధ్యక్షులు అల్లాడ రామాంజనేయులు, నాయకులు కోట రాజా, కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.