Home Political news సమస్యల పరిష్కారానికి వినతుల వెల్లువ సమస్యలను పరిష్కరిస్తూ.ప్రజలతో అభినందనలు పొందుతున్న నేతలు

సమస్యల పరిష్కారానికి వినతుల వెల్లువ సమస్యలను పరిష్కరిస్తూ.ప్రజలతో అభినందనలు పొందుతున్న నేతలు

2
0

 *26.07.2024*

సమస్యల పరిష్కారానికి వినతుల వెల్లువ సమస్యలను

 పరిష్కరిస్తూ.ప్రజలతో అభినందనలు పొందుతున్న నేతలు

నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ప్రజలే దేవుళ్లు.. ప్రజా సమస్యలు పట్టించుకునే వాళ్లే నాయకులు అన్నట్లు తమ సమస్యలకు పరిష్కారం చూపుతున్న కూటమి నేతల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజల నుండి తీసుకున్న వినతులపై సంబంధిత అధికారులు అర్జీదారులకు ఫోన్లు చేస్తూ సమస్యలకు పరిష్కారం చూపుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు కూడా మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ లు గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వచ్చిన అర్జీలలో వెంటనే పరిష్కరించదగిన వినతులపై సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యను తెలియజేసి పరిష్కరించాలని ఆదేశించారు. వినతులను శాఖల వారిగా విభజించి ఆయా శాఖలకు పంపించి పరిష్కారానికి ఆదేశించారు. టీడీపీ పార్టీ కోసం కృషి నామినేటెడ్ పదవులు ఆశిస్తూ నేతలు ఇచ్చిన ఆర్జీలను రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్ స్వీకరించారు. ప్రజా సమస్యలపై వచ్చిన వినతులను మంత్రి పయ్యావుల కేశవ్ స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.       

గత పాలనలో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు… వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లుల రాక ఇబ్బందులు పడుతున్నవారు, చదువుకోసం, విదేశీ విద్య సాయంకోసం, ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం చేయాలంటూ కొందరు. 1998 డిఎస్పీ అభ్యర్థులు, కళ్యాణమిత్రలు, సాగునీటి సమస్యలు సాగు ప్రాజెక్టులపై మరికొందరు. డ్వాక్రా గ్రూపు మహిళలు, భూ సమస్యలు, భూ కబ్జాలు, ఎస్సీఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్యలు ఇలా అనేక సమస్యలపై నేడు వినతులతో వందల మంది అర్జీదారులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. వారందరి అర్జీలను అర్జీదారులు చెబుతున్న సమస్యలను ఓపిగ్గా వింటుంటే.. ఇది కదా ప్రజా ప్రభుత్వమంటూ వారు మెచ్చుకుంటున్నారు. ప్రజా నాయకులు అంటే వీళ్లు కదా అంటూ పోగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రాజు ఎలా ఉంటే తన కింది వారు కూడా అలాగే ఉంటారని… ప్రజా నాయకుడు చంద్రబాబులాగే నేడు ప్రజలకోసం పనిచేస్తున్న నాయకులను చూస్తుంటే గర్వంగా ఉందని అర్జీదారులు అంటున్నారు. గతపాలకులకు అర్జీలు ఇవ్వడం కాదుకదా.. వారి ఇళ్ల గేట్లముందుకు కూడా వెళ్లలేకపోయేవాళ్లమన్నారు. నేడు టీడీపీ నాయకులు, కూటమి నేతలు.. ప్రజలతో మమేకమై ప్రజల్లో ప్రజలుగా.. ప్రజా నాయకులుగా ప్రజా సమస్యలు వింటున్నారని దీన్నే ప్రజా ప్రభుత్వం అంటారని వారు అంటున్నారు. 

• 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా సహకారం అందిందని.. తరువాత ప్రభుత్వం మారడంతో.. తీవ్రంగా నష్టపోయారని ఏపీఐసీ అందించే 22.5 శాతం సబ్జీడీ ఎస్సీ ఎస్టీలకు అందాల్సి ఉండగా గత ప్రభుత్వం తెచ్చిన కండిషన్ల వల్ల.. అది 1.5 శాతం కూడా మించడం లేదని.. దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు మీనుగా గోపాల్ వాపోయారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కలిసి తమ సమస్యను విన్నవించి పరిష్కరించాలని వారు కోరారు. 

• తిరుపతికి చెందిన నరసింహ యాదవ్, విజయవాడ పాయకాపురంకు చెందిన తాతినేని రవి కుమారుడు నాగసాయికు, విజయవాడకు చెందిన మరోక వ్యక్తి రాంబాబు, బ్రోయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న యలమంచిలి నియోజకవర్గం కోత్తపట్నం గ్రామానికి చెందిన చెల్లూరి సత్యయ్య తో పాటు పలువురు బాధితులు తమ ఆరోగ్య సమస్యలు దృష్టా సీఎంఆర్ఎఫ్ ను అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

• 2018 ఏప్రిల్ 20 టీడీపీ ప్రభుత్వంలో నియమించిన కళ్యాణ మిత్రలను అనంతరం 2019లో అధికారంగం చేపట్టిన వైసీపీ కక్షగట్టి తొలగించిందని.. తమకు మళ్లీ అవకాశం కల్పించాలని దాదాపు 50 మందికి పైగా కళ్యాణమిత్రలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసయాదవ్ కు వినతి అందించారు. 

• 2021 లో హైకోర్టు ఏపీలో ఉండే ఎక్స్ హోంగార్డులను వెంటనే తిరిగిని విధుల్లోకి తీసుకోవాలని జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చినా ఇప్పటికి తమకు న్యాయం జరగలేదని… గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని… తమను మళ్లీ హోంగార్డులుగా తీసుకుని న్యాయం చేయాలని వారు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

• విశాఖకు చెందిన ఓ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా బజార్ ఏర్పాటుకు దాదాపు లక్షల రూపాయల డబ్బులు కట్టగా… డ్వాక్రా బజార్ ఏర్పాటు ఆగిపోవడంతో తీవ్రగంగా నష్టపోవాల్సి వచ్చిందని.. తమయందు దయ ఉంచి డ్వాక్రా బజార్ ఏర్పాటు చేసుకునేలా న్యాయం చేయాలని స్టేట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ కే. దేవకీ దేవి విజ్ఞప్తి చేశారు. 

• ఏలూరు, శ్రీకాకుళం తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున భూ సమస్యలపై అర్జీలు అందాయి… వాటి పరిష్కారాని కృషి చేస్తామని మంత్రి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షలు అర్జీదారులకు హామీ ఇచ్చారు. వెంటనే సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులకు ఫోన్లు చేసి గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని చూచించారు. అర్జీలను ఆ శాఖకు పంపించారు. 

• టీడీపీ హయాంలో జరిగిన నరేగా పనుల బిల్లులు నేటికి రాలేదని… గత ప్రభుత్వం కక్షపూరితంగా బిల్లులను ఆపేసిందని… వాటిని వెంటనే చెల్లించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 40 కోట్ల వరకు విడుదల చేసినట్లు.. మిగిలన డబ్బులను కూడాత్వరలోనే విడుదల చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. 

• గత పంది సంవత్సరాలుగా వ్యవసాయశాఖలో చాలీ చాలని జీతాలతో కాంట్రాక్టు పద్దతిలో mpeos గా పనిచేస్తున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని పలువురు ఉద్యోగులు గ్రీవెన్స్ లో విన్నవించారు. 

వీటితో పాటు అనే సమస్యలపై అర్జీదారులు తమ వినతులను టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస యాదవ్, మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here