Home Political news సమస్యల పరిష్కారమే వారధి ప్రధాన లక్ష్యం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపి...

సమస్యల పరిష్కారమే వారధి ప్రధాన లక్ష్యం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి

3
0

 భారతీయ జనతా పార్టీ 

ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కారమే  వారధి ప్రధాన లక్ష్యం

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ… సమస్యల పరిష్కారమే ధ్యేయంగా  వారధి కార్యక్రమాన్ని  ప్రారంభించామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని  ఆమె ప్రారంభించారు, ఈ సందర్భంగా సమస్యల స్వీకరణ లాంఛనంగా  పురేందేశ్వరి  ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేసి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా  పురందేశ్వరి మాట్లాడుతూ బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తారని  ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవారదిలా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర కార్యాలయంలో  స్వీకరించిన సమస్యలను క్రోడీకరించి  ఏ ప్రభుత్వ విభాగానికి పంపించాలి  సమస్య తీవ్రతను ఆధారంగా పరిష్కారానికి ప్రాధాన్యతల విషయంలో  ప్రత్యేకంగా తయారు చేసిన  ఒక సాఫ్టవేర్ ను వినియోగిస్తున్నారు  ఇందుకోసం ఏర్పాటు చేసిన  వెబ్ సైట్ ను  రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.

సమస్యలు  వెల్లువలా వచ్చాయి . ఈ సందర్భంగా చిన్న చిన్న సమస్యలకు అక్కడికక్కడే  పురందేశ్వరి  పరిష్కార మార్గాన్ని సూచించారు. దాదాపు గా ప్రధాన సమస్యలు 20 వరకు వచ్చాయి ప్రకాశం జిల్లా  నుండవి  500 కోట్లు అవినీతి దగ్గర నుండి కడప జిల్లాలో జరిగిన ఒక హత్యకేసు పోలీసులు నమోదు చేయలేని విషయం వరకు అనేక సమస్యలు  వచ్చాయి అదేవిధంగా జాతీయ రహదారుల విభాగం పైన కూడా సమస్యల పై వినతులు వచ్చాయి.

ఒంగోలు పార్లమెంటు పరిధిలోని జాతీయ ఉపాది హామీ పధకానికి సంబందించి కేంద్రం విడుదల చేసిన 3,383 కోట్లు 2019 ….24 సంవత్సరాల మద్య విడుదలైన నిధుల్లొ 500 కోట్లు అవినీతి జరిగిందని  ఇందుకు ఆనాటి డ్వామా అధికారి  శీనారెడ్డి కారకులని ఫిర్యాదు దారుడు  ఈదర మోహన్  ఫిర్యాదు చేశారు. ఈ  అవినీతి పై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు దారుడు పురందేశ్వరి ని కోరారు. అవినీతి కి కారుకులైన వారిని  శిక్షించాలని  కోరారు.

క్రుష్ణా జిల్లా  వీరపనేనిగూడెం, మర్లగూడెం, టెంపుల్లి గ్రామాలకు చెందిన రైతులు  వీరపనేని గూడెం వద్ద ఉన్న ర్యాంప్ ను  జాతీయ రహదారుల విభాగం కొనసాగించాలని కోరారు. అక్కడ ఐటి పార్క్ ఇచ్చారని  అందువల్ల వీరపనేనిగూడెం వద్ద ఉన్న ర్యాంప్ తొలగించినందువల్ల నాలుగు కిలోమీటర్లు తిరిగి రావడంతో పాటు మద్యలో  రైల్వే గేటు ఉన్నందువల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు  చిగురుపాటి కుమార స్వామి నేత్రుత్వంలో  జాస్తి మురళీ తదితర రైతులు తమ గోడును   ఈ సందర్భంగా  వివరించారు. తెలుగుగంగ ప్రాజెక్టు వద్ద గోపవరం గ్రామంలో  వైసీపి నేత భూఆక్రమణలకు పాల్పడ్డాడని ఫిర్యాదులు చేశారు. కడప జిల్లాలో  కొర్రపాటి పల్లిలో వైసీపి నేత ఒక హత్యకు పాల్పడితే  ఈ సంఘటన పై పోలీసులు కనీసం   ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదని  బాదితులు  ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.  

 ఈ కార్యక్రమంలో  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, బిజెపి రాష్ట్రమీడియా ఇంచార్జి పాతూరి నాగభూషణం,  రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు  నిర్మలాకిషోర్ బిజెపి హెడ్ క్వార్టర్ ఇంఛార్జి శివామకుటం, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు  అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

బిజెపి లో చేరికలు ప్రకాశం జిల్లా  గిద్దలూరు  వైకాపా నేత మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలీ, దిగువమెట్ట సర్పంచ్ అంజినాయక్ మండల స్ధాయి వైసీపి నేతలు  రాష్ట్ర అధ్యక్షురాలు  పురందేశ్వరి సమక్షంలో  కాషాయ కండువా కప్పుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here