Home Andhra Pradesh స‌మ‌న్వ‌యం, స‌మ‌ష్టి కృషితో మాద‌క ద్ర‌వ్యాల‌కు అడ్డుక‌ట్ట‌ మ‌త్తు ప‌దార్థాల వినియోగంతో క‌లిగే దుష్ప‌రిణామాల‌పై...

స‌మ‌న్వ‌యం, స‌మ‌ష్టి కృషితో మాద‌క ద్ర‌వ్యాల‌కు అడ్డుక‌ట్ట‌ మ‌త్తు ప‌దార్థాల వినియోగంతో క‌లిగే దుష్ప‌రిణామాల‌పై పెద్దఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. గుమ్మ‌ళ్ల సృజ‌న‌

3
0

 *ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 26, 2024*

స‌మ‌న్వ‌యం, స‌మ‌ష్టి కృషితో మాద‌క ద్ర‌వ్యాల‌కు అడ్డుక‌ట్ట‌

మ‌త్తు ప‌దార్థాల వినియోగంతో క‌లిగే దుష్ప‌రిణామాల‌పై 

పెద్దఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. గుమ్మ‌ళ్ల సృజ‌న‌

స‌మ‌న్వ‌యం, స‌మ‌ష్టి కృషితో మాద‌క ద్ర‌వ్యాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు వివిధ శాఖ‌ల అధికారులు.. స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో కృషిచేయాల‌ని, మ‌త్తు ప‌దార్థాల దుర్వినియోగం, దుష్ప‌రిణామాల‌పై పెద్దఎత్తున అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. గుమ్మ‌ళ్ల సృజ‌న సూచించారు.

అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం, అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ ఆధ్వ‌ర్యంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త ఫౌండేషన్ భాగ‌స్వామ్యంతో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న మాట్లాడుతూ యువ‌త మాదక‌ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉండాలని… బంగారు భ‌విష్య‌త్తు దిశ‌గా అడుగులేయాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. ఇప్ప‌టికే మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, అక్ర‌మ ర‌వాణాను అడ్డుకోవ‌డంలో అత్యుత్త‌మ ప‌నితీరుతో జిల్లా ముందుంద‌ని.. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా వినూత్న అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలతో పాటు డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ దిశ‌గా పోలీస్‌, మ‌హిళా శిశు సంక్షేమం, యువ‌జ‌న స‌ర్వీసులు త‌దిత‌ర శాఖ‌ల‌తో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ముందుకెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, నందిగామ ఆర్‌డీవో ఎ.ర‌వీంద్ర‌రావు, జిల్లా యువ‌జ‌న స‌ర్వీసుల అధికారి యు.శ్రీనివాస‌రావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, ఫోరం ఫ‌ర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేట‌ర్ అర‌వ ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

న‌లంద క‌ళాశాల‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం

జిల్లా యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలోని న‌లంద క‌ళాశాల‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. చెడు వ్య‌స‌నాల వ‌ల్ల జీవితం ఎలా ఛిద్ర‌మ‌వుతుందో వివ‌రించారు. నేను సైతం నా జీవితంలో ఎప్పుడూ మ‌త్తు ప‌దార్థాలు, మాద‌క ద్ర‌వ్యాలు వాడ‌న‌ని.. నేను, నా స‌మాజాన్ని మాద‌క ద్ర‌వ్యాల 

నుంచి ర‌క్షించేందుకు మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌మీద దృష్టిపెడ‌తానంటూ విద్యార్థుల‌తో ప్ర‌తిజ్ఞ చేయించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా యువ‌జ‌న స‌ర్వీసుల అధికారి యు.శ్రీనివాస‌రావు, మాచ‌వ‌రం పోలీస్ స్టేష‌న్ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ శంక‌ర‌రావు, నలంద క‌ళాశాల ప్రిన్సిప‌ల్ అనురాధ‌, సూప‌రింటెండెంట్ పీవీ రాఘ‌వ శ‌ర్మ‌, మేనేజ‌ర్ డి.సుబ్బారావు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here