సమన్వయంతో ముందుకు వెళ్దాం..కార్పొరేటర్ల సమావేశంలో
ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అందరం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ , టిడిపి జనసేన, బిజెపి పశ్చిమ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలతో తాడిగడప లోని క్యాంపు కార్యాలయంలో సుజనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
అందరం సమన్వయంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు.
వైసిపి ఐదేళ్ల అరాచక పాలనలో విసిగిపోయిన ప్రజలు ఎన్డీయే కూటమి కి పట్టం కట్టారన్నారు.
ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని అధికారుల సమన్వయంతో మిగిలిన నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అందరం కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దాం అన్నారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు మైలవరపు దుర్గారావు, బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ, మరుపిళ్ల రాజేష్, మహాదేవు అప్పారావు, అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబు తదితరులు పాల్గొన్నారు.