సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు నారావారిపల్లె వెళ్ళిన మంత్రి లోకేష్ అక్కడ ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, గ్రామీణ ఆటల పోటీలను సిఎం చంద్రబాబు,
భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రహ్మణి ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీల్లో దేవాస్ష్ స్వయంగా పాల్గొని సందడి చేశాడు. గ్రామంలో కాలినడకన తిరిగి అక్కడి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నారా, నందమూరి కుటుంబాల రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.