శ్రీ సరస్వతీ దేవి గా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్న రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్ పర్సన్ అంజనా సిన్హా

Spread the love

 శ్రీ సరస్వతీ దేవి గా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

అమ్మవారిని దర్శించుకున్న రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్ పర్సన్ అంజనా సిన్హా

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 9 : స్థానిక  చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో  జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.  మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి  శ్రీ సరస్వతి దేవి అలంకారంతో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్ పర్సన్ అంజనా సిన్హా  అమ్మవారిని దర్శించుకున్నారు ఆమెకు దేవస్థానం పాలకమండలి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు,  కార్యదర్శి  మరుపిళ్ల హనుమంతరావు, అధ్యక్షుడు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దసరా మహోత్సవాల సందర్భంగా  ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.  ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు  కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ (రాజా), శీరం వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు పోతిన బేసికంటేశ్వరుడు, మజ్జి ఈశ్వరరావు, తొత్తడి భరత్ కుమార్ , పోతిన సాంబశివరావు, భోగవల్లి శ్రీధర్ , ముదిలి గణేష్, బంక హనుమంతరావు, ఈది ఎల్లా రాజారావు, పిళ్లా విజయ్ కుమార్, మజ్జి శ్రీనివాసరావు పోతిన వెంకట ధర్మారావు, గూడేల రామకృష్ణ,  కామందుల నరసింహారావు, తమ్మిన సూర్యకుమారి, పనుకు రమ,తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *