దుర్గా శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అలంకృత అమ్మవారిని శాసనమండలి సభ్యులు హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు
వారికి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు మీడియా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలో కూడా గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.