శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,శ్రీ నందీశ్వర స్వామి వారికి పాత శివాలయం ప్రదోష కాల సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేషార్చన
వన్ టౌన్, విజయవాడ.
NTR జిల్లా, విజయవాడ లో గల ద్వాపర యుగంలో శ్రీ ధర్మరాజు వారిచే ప్రతిష్టిoపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, పాత శివాలయం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాఢ బహుళ త్రయోదశి అనగా ది:22-7-2025 మంగళవారం సాయంత్రం 4గంటల నుండి 6 గంటల వరకు శ్రీ నందీశ్వర స్వామి వారికి ప్రదోష కాల సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేషార్చన మరియు పంచహారతులు ఉభయదాతలకు మంత్ర పుష్పము, ఆశీర్వచనం కార్యక్రమములు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ బొమ్ము మధు సమక్షమున ఆలయ అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ అభిషేకపండిత్ కొత్తపల్లి సాయి కృష్ణ శర్మ సహాయక నాదెళ్ళ లక్ష్మి రాఘవేంద్ర శర్మ మరియు ఆలయ సిబ్బంది వారి అధ్వర్యంలో జరిగినవి
ఇట్లు
శ్రీ స్వామి వారి సేవలో
కార్యనిర్వహణాధికారి