*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 14, 2024*
శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఈనెల 15వ తేదీ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు తదితరులు హా
జరవుతారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుందని.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పటిష్ట సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రివర్యులు.. అధికారులు, సిబ్బందికి సూచించారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా.. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.